ఒక సెంటులో గ్రావెల్ దందా
‘ఒక సెంటు’ ఇళ్ల పట్టాలకు కేటాయించిన కొన్ని స్థలాలు గ్రావెల్ దందాకు కేంద్రంగా మారాయి. కొండ వాలు ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లపై అక్రమార్కుల కన్ను పడడంతో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. కొన్ని చోట్ల లేఅవుట్లు చదును చేసే పేరుతో తవ్వేసి అమ్ముకుంటున్నారు.
హద్దు రాళ్లు తొలగించి అక్రమంగా తరలింపు
-ఈనాడు, విశాఖపట్నం, న్యూస్టుడే, ఆనందపురం, సబ్బవరం
ఆనందపురం మండలం గండిగుండం లేఅవుట్కు సమీపంలో తరలింపునకు సిద్ధం చేసిన గ్రావెల్
‘ఒక సెంటు’ ఇళ్ల పట్టాలకు కేటాయించిన కొన్ని స్థలాలు గ్రావెల్ దందాకు కేంద్రంగా మారాయి. కొండ వాలు ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లపై అక్రమార్కుల కన్ను పడడంతో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. కొన్ని చోట్ల లేఅవుట్లు చదును చేసే పేరుతో తవ్వేసి అమ్ముకుంటున్నారు.
ఆనందపురం మండలం గండిగుండంలో వీఎంఆర్డీఏ (విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ) ఒక సెంటు ప్లాట్లు అభివృద్ధి చేసింది. సుమారు 15 ఎకరాల్లో 400 ప్లాట్లు వేశారు. కొండ వాలు ప్రాంతమైనా చదును చేసి ఒక సెంటు ప్లాట్లుగా విభజించి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా ఈ ప్లాట్లు వేసిన కొండ వాలును కొందరు తవ్వేస్తున్నారు. గతంలో అక్కడ వేసిన హద్దు రాళ్లు చాలా వరకు ఇప్పుడు కనిపించడం లేదు. ఆ పరిసరాల్లో ఎక్కడ చూసినా పొక్లెయిన్తో తవ్విన ఆనవాళ్లున్నాయి. రోడ్డు నిర్మాణానికి అని చెబుతున్నా అలా లేదక్కడ. రాత్రిళ్లు తరలించేందుకు లేఅవుట్కు మరో వైపు గుట్టలుగుట్టలుగా రోడ్డు పక్కనే నిల్వ చేశారు. గ్రామ శివారున ఈ ప్రాంతం ఉండడంతో వాహనాల రాకపోకలకు ఏర్పాట్లు చేసి పట్టుకుపోతున్నారు. సమీపంలోని కొన్ని ప్రైవేటు లేఅవుట్లలోకి తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరో చోట గ్రావెల్కు అనుమతి తీసుకొని ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం గ్రావెల్ కోసమే ఇక్కడ తవ్వకాలు చేపడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. చదును చేయడానికయితే కొండ వాలును తవ్వి మట్టి కింద వేసి లెవెలింగ్ చేయాలి. ఆ పరిస్థితులూ లేవు.
పెందుర్తి మండలం ముదపాకలో కేటాయించిన లేఅవుట్ల వద్దా అదే పరిస్థితి. ఇక్కడి కొండవాలు ప్రాంతం నుంచి అక్రమంగా గ్రావెల్ తీసుకువెళ్తున్నారు. అధికారులకు సైతం ఫిర్యాదులు అందాయి. పరవాడ మండలంలోనూ గతంలో మట్టి తరలించారు.
సబ్బవరం మండలం గంగవరం ప్రాంతంలో ఒక సెంటు ఇళ్ల స్థలాలకు కేటాయించిన లేఅవుట్ నుంచి కొద్ది రోజులుగా మట్టి అక్రమంగా తరలిపోతుంది. ఇక్కడ అనధికారికంగా సాగుతున్న తవ్వకాలకు అడ్డే లేదు. ఈ లేఅవుట్లో 9 వేల ప్లాట్లు ప్రతిపాదించారు. కొన్ని చోట్ల హద్దు రాళ్లు వేయగా మరికొన్ని చోట్ల పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే మట్టిని కొందరు పట్టుకుపోతున్నారు. పలువురు అక్రమంగా తవ్వేస్తుండడంతో కొద్ది రోజుల కిందట పోలీసులు గస్తీ నిర్వహించారు. ఆ తరువాత పరిస్థితి మొదటికి వచ్చేసింది.
నగర శివారు ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు లేఅవుట్లకు చెందిన వ్యక్తులు గ్రావెల్ను వాహనాల్లో తరలిస్తుండగా.. మరికొందరు నిల్వ చేస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వదిలేయడంతో వారి అక్రమాలకు అంతే లేకుండా పోతోందనే విమర్శలొస్తున్నాయి. ఆనందపురం, సబ్బవరం, అనకాపల్లి, పెందుర్తి మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!