అంతే .. అక్కడితో సరి
నగరంలో మహిళల భద్రతకు వీలుగా ప్రవేశపెట్టిన పలు సౌకర్యాలను పూర్తిస్థాయిలో విస్తరించటం లేదు. బస్స్టాండు, రైల్వేస్టేషన్, విమానాశ్రయాలకు నిత్యం వచ్చే వారిలో మహిళలు, వృద్ధులు సురక్షితంగా గృహాలకు చేరుకోవటానికి తీసుకుంటున్న చర్యలు పకడ్బందీగా లేవు.
రైల్వేస్టేషన్లోనే ‘ప్రీపెయిడ్ ఆటోలు’
అమలుకాని విస్తరణ ఆలోచనలు
ఈనాడు, విశాఖపట్నం, రైల్వేస్టేషన్, న్యూస్టుడే
విశాఖ రైల్వేస్టేషన్లో ప్రీపెయిడ్ ఆటోస్టాండ్
నగరంలో మహిళల భద్రతకు వీలుగా ప్రవేశపెట్టిన పలు సౌకర్యాలను పూర్తిస్థాయిలో విస్తరించటం లేదు. బస్స్టాండు, రైల్వేస్టేషన్, విమానాశ్రయాలకు నిత్యం వచ్చే వారిలో మహిళలు, వృద్ధులు సురక్షితంగా గృహాలకు చేరుకోవటానికి తీసుకుంటున్న చర్యలు పకడ్బందీగా లేవు.
రైల్వేస్టేషన్లోనే పోలీసులు ‘ప్రీపెయిడ్ ఆటో స్టాండ్’ను ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చే ప్రయాణికులు ఎక్కడికి వెళ్లాలో చెబితే ఆటో కేటాయించి.. ఎంత చెల్లించాలన్నది రాసిస్తారు. తమ దగ్గరున్న రికార్డులో ప్రయాణికులకు కేటాయించిన ఆటో నెంబరు, డ్రైవర్పేరు నమోదు చేసుకుంటారు. ఈ విధానం మహిళలకు అత్యంత ఉపయుక్తంగా మారింది. నిత్యం దాదాపు వెయ్యి మంది ఈ సేవలను ఉపయోగించుకుంటున్నట్లు అంచనా.
ప్రయాణికులు ఆట్లో ఏమైనా వస్తువులు మరచిపోతే డ్రైవర్లు ‘ప్రీపెయిడ్ ఆటోస్టాండ్’లో ఇస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నాలుగోపట్టణ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ నుంచి షిఫ్టుకు ఇద్దరు చొప్పున విధులు నిర్వహిస్తూ.. 24 గంటలూ ఈ సేవలు అందిస్తున్నారు. రాత్రి పది దాటిన తరువాత నగరానికి వచ్చే మహిళలకు ‘ప్రీపెయిడ్ ఆటో స్టాండ్’ ఎంతగానో ఉపయోగపడుతోందని చెబుతున్నారు.
ఈ తరహా సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని అధికారులు భావించారు. ఏళ్లు గడుస్తున్నా ఆ ప్రతిపాదనలు మాత్రం సాకారం కావడంలేదు. రైల్వేస్టేషన్లో కూడా జ్ఞానాపురం వైపు ఈ సౌకర్యం లేదు.
ఇక్కడ మూతపడ్డాయి:
గతంలో ద్వారకా బస్కాంప్లెక్స్లో పోలీసులే ఆటోల్లో ప్రయాణికుల్ని పంపే విధానం అమలు చేశారు. కాలక్రమంలో దాన్ని నిలిపివేశారు. మళ్లీ పునరుద్ధరించలేదు. ప్రీపెయిడ్ ఆటోస్టాండు విశాఖ విమానాశ్రయంలోనూ కొంతకాలం కొనసాగింది. కొవిడ్ సమయంలో దాన్ని ఆపారు. పునరుద్ధరించాలనే సూచనలూ వస్తున్నాయి. ప్రయాణికుల భద్రత నిమిత్తం పోలీసులు ‘అభయం’ పేరిట ఒక ఉపకరణాన్ని ఆటోల్లో అమరుస్తున్నారు. ప్రయాణికులు ఆటోల్లో ఉన్నప్పుడు.. ఆపదలో ఉన్నామని భావిస్తే ఉపకరణంలోని బటన్ను నొక్కితే చాలు ...క్షణాల్లో సమాచారం అంది సత్వరం పోలీసులు వస్తారు. ఒక్కసారి మీటనొక్కితే మళ్లీ పోలీసులు అనుమతిస్తేనే ఆటో ఇంజిన్ పని చేస్తుంది. నగరంలో 30వేలకు పైగా ఆటోలుండగా ఇప్పటివరకు కేవలం 6,800 ఆటోల్లోనే ‘అభయం’ ఏర్పాటు చేశారు.
దిశా పెట్రోలింగ్:
మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని 9 అధునాతన జీపులు, 23 ద్విచక్రవాహనాలను పోలీసులు సమకూర్చారు. వీటిపై నగరవ్యాప్తంగా తిరుగుతూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఘటనా స్థలాలకు వెళ్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు ‘పహారా’ పేరిట నగరంలోని 16చోట్ల ఇద్దరు చొప్పున కానిస్టేబుళ్లను అందుబాటులో ఉంచుతున్నా వారెక్కడుంటారనే అంశంపై మాత్రం సరైన ప్రచారం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులో సీఎం... ఎండలో జనం
[ 24-04-2024]
సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
పునరావాసం.. పచ్చి మోసం
[ 24-04-2024]
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
యువతా.. ఓటుకు తరలిరండి..
[ 24-04-2024]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. -
కూపన్లపై పెట్రోలు, డీజిల్ పోయడం కోడ్ ఉల్లంఘనే: జేసీ
[ 24-04-2024]
రాజకీయ పార్టీలు జారీ చేసే కూపన్ల ఆధారంగా పెట్రోలు, డీజిల్ పోస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయా పెట్రోలు బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?
[ 24-04-2024]
జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్ పాలకు ఐదేళ్లయింది. -
కోలాహలంగా విష్ణుకుమార్రాజు నామినేషన్
[ 24-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు నామినేషన్ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగనన్న వస్తే తప్పని తిప్పలు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. -
కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
విశాఖ లోక్సభ స్థానానికి మూడు నామపత్రాలు
[ 24-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. -
సోషల్ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి
[ 24-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. -
మాట తప్పారు.. మడమ తిప్పారు..
[ 24-04-2024]
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు