అందుబాటులోకి అమృత్ సరోవరాలు
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా అన్నిశాఖల పరిధిలోనూ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. తాజాగా పల్లెసీమలకు, పాడిపంటలకు జీవనాధారమైన సాగునీటి చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
సాగునీటి వనరుల అభివృద్ధి
ఉపాధిహామీ నిధులతో తటాకాలకు కొత్తరూపు
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా అన్నిశాఖల పరిధిలోనూ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. తాజాగా పల్లెసీమలకు, పాడిపంటలకు జీవనాధారమైన సాగునీటి చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
అమృత్ సరోవర్ నిర్మాణ్ పేరుతో ఒక్కో జిల్లాకు 75 చెరువులు చొప్పున గుర్తించారు. ఉపాధిహామీ పథకంలోనే వీటిని చక్కదిద్దనున్నారు. ఈ మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని సాగునీటి వనరుల్లో చేయాల్సిన పనులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేస్తున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఇప్పటికే సాగునీటి చెరువులు, వనరుల మట్టి పనులు చేపడుతున్నారు. వీటికి అదనంగా అమృత్ సరోవర్లో మరికొన్ని కొత్త చెరువులు తవ్వుతారు. కొన్ని పాతవాటిని పునరుద్ధరిస్తారు. జలవనరుల శాఖ, స్థానిక నేతలు సిఫార్సు చేసిన సాగునీటి వనరులనే పరిగణనలోకి తీసుకున్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 75 చెరువులు చొప్పున గుర్తించారు. విశాఖ జిల్లాలో నాలుగు మండలాలే ఉండడంతో ఒక్కో మండలంలో నాలుగైదు చెరువులనే గుర్తించగలిగారు. ఒక్కో చెరువుపై రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో రూ.40 లక్షలు అంచనా విలువ దాటిన పనులు 10 వరకు ఉన్నాయి. మిగతా చెరువులన్నీ ఇదివరకు పనిచేసినవే కావడంతో రూ.10 లక్షల లోపే ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ పనుల వల్ల పాత ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్త ఆయకట్టును సృష్టించనున్నారు.
ఎలా చేస్తారంటే..?
కనీసం ఎకరం విస్తీర్ణం ఉండాలి.
చెరువులో 10 వేల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి పనిచేసే విధంగా ఉండాలి.
పాత చెరువైతే తుప్పలు, పొదలు తొలగిస్తారు.. చెరువు గర్భంలో పూడిక తీస్తారు.. గట్లు పటిష్ఠపరుస్తారు.
అమృత్ సరోవర్ నిర్మాణ్లో నిధులన్నీ ఉపాధిహామీ పథకం నుంచి ఖర్చుచేస్తారు. అయితే కేవలం వేతనాల రూపంలోనే చెల్లిస్తారు. మెటీరియల్ పనులు చేయరు.
కొత్తవాటికే ప్రాధాన్యం
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా చేపడుతున్న చెరువుల కావడంతో వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఉన్నవాటిలో పనులు చేయడం కంటే కొత్త చెరువులు తవ్వడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రవి పట్టన్శెట్టి జలవనరులు, డ్వామా అధికారులకు, తహసీల్దార్లకు సూచించారు. క్షేత్రస్థాయిలో కొన్ని స్థలాలను తహసీల్దార్లు పరిశీలించి స్థానికులకు అన్నివిధాలా ఉపయోగం ఉన్నవాటినే అమృత్ సరోవర్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉపాధిహామీ చేపడుతున్న పనులకు భిన్నంగా ఈ చెరువులను అభివృద్ధి చేయనున్నారు. ఉపాధి పనులను పరిశీలించడానికి ఏటా కేంద్ర బృందాలు జిల్లాకు వస్తుంటాయి. ఇకపై వచ్చే బృందాలు ఈ చెరువులను పరిశీలించడానికే ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. అందుకే ఈ సాగునీటి వనరులను బాగా తీర్చిదిద్దనున్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో చెరువులన్నింటికీ అంచనాలు పూర్తయ్యాయని డ్వామా పీడీ సందీప్ వెల్లడించారు. వచ్చే నెలలో వీటిని కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: కేఏ పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే