logo

ఉరేసుకొని ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఒక వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుచ్చిరాజుపాలెం గవర వీధిలో నివాసం ఉంటున్న బొట్టు సత్యనారాయణ (40) ఆటో డ్రైవర్‌. ఇతనికి ఇద్దరు పిల్లలు. భా

Published : 28 Jun 2022 06:53 IST


సత్యనారాయణ (పాత చిత్రం)

మాధవధార, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఒక వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుచ్చిరాజుపాలెం గవర వీధిలో నివాసం ఉంటున్న బొట్టు సత్యనారాయణ (40) ఆటో డ్రైవర్‌. ఇతనికి ఇద్దరు పిల్లలు. భార్యతో గత కొన్ని రోజులుగా గొడవలు జరగడంతో ఆమె పెందుర్తిలోని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సత్యనారాయణ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగానే ఉంటున్నాడు. ఆదివారం పిల్లలు తల్లి దగ్గరకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం, అప్పటికే మనస్తాపంతో ఉన్న సత్యనారాయణ ఇంట్లో ఫ్యాన్‌ హుక్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి పిల్లలు ఎన్నిమార్లు ఫోన్లు చేసినా స్పందించలేదు. దీంతో సోమవారం ఉదయం చుట్టుపక్కల స్థానికులకు అనుమానం వచ్చి ఇంట్లో చూడగా ఉరేసుకొని ఉన్నాడు. వెంటనే పిల్లలకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. కుమారై దుర్గా భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని