బడి..చేసేద్దాం రెడీ
పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాలు మంగళవారం నుంచి మొదలయ్యాయి. ఉపాధ్యాయులంతా పాఠశాలలకు చేరుకుని సిబ్బందితో కలిసి ఆవరణను శుభ్రం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మంగళవారం పారిశుద్ధ్య కార్యక్రమాలను పురపాలక,
బలిఘట్టం హైస్కూల్లో సంసిద్ధత కార్యక్రమాలు వివరిస్తున్న ప్రధానోపాధ్యాయుడు
నర్సీపట్నం అర్బన్, చోడవరం, న్యూస్టుడే: పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాలు మంగళవారం నుంచి మొదలయ్యాయి. ఉపాధ్యాయులంతా పాఠశాలలకు చేరుకుని సిబ్బందితో కలిసి ఆవరణను శుభ్రం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మంగళవారం పారిశుద్ధ్య కార్యక్రమాలను పురపాలక, పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో చేపట్టాలి. వీరి సహకారం తీసుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. ఈ నెల 28న పాఠశాలల్లోని తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించాలి. నీటి నమూనాలను పరీక్షించాలి. నమూనాలను పరీక్షించేందుకు ఎక్కడకు పంపాలన్న దానిపై స్పష్టత లేదు. సచివాలయాల ఇంజినీరింగ్ సహాయకుల వద్ద పరీక్షకు అవసరమైన కిట్లు ఉన్నాయన్న విషయం చాలామంది ఉపాధ్యాయులకు తెలియదు. కొందరు మాత్రం బలిఘట్టంలోని తాగునీటి నమూనాల ప్రయోగశాల ప్రతినిధులను సంప్రదించారు. పరీక్షకు నిర్ణీత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని సిబ్బంది చెప్పారని పలువురు ఉపాధ్యాయులు ‘న్యూస్టుడే’ దృష్టికి తీసుకువచ్చారు.
* 29న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. పాఠశాల అభివృద్ధి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. పిల్లల తల్లిదండ్రులంతా హాజరైతే ఎంతో ప్రయోజనంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
* 30న బడి బయట పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్చుకునే కార్యక్రమం చేపట్టాలి. జులై ఒకటో తేదీన సైన్స్ ల్యాబ్లను శుభ్రం చేయించడం, క్రీడా సామగ్రిని సిద్ధం చేయడం తదితర కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ప్రయోగశాలలకు అవసరమైన రసాయనాలు, పరికరాల కొనుగోలుకు గడిచిన విద్యా సంవత్సరంలో పాఠశాల అభివృద్ధికి కేటాయించిన మొత్తంలో మిగులు నిధులను ఇందుకు వినియోగించాలని కొందరు భావిస్తున్నారు. నిధులు అందుబాటులో లేనిచోట ఉపాధ్యాయులు ముందుగా తాము ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
* జులై 2న పాఠశాలల భద్రత, ప్రథమ చికిత్స కార్యక్రమాలు చేపట్టాలి. శిథిలమైన కట్టడాలు ఉంటే అధికారులు, తల్లిదండ్రుల కమిటీ దృష్టికి తీసుకువెళ్లి వాటి తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలి.
* జులై 4లోగా వంట గదులను పరిశుభ్రంగా ఉంచాలి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే ఐదో తేదీన పండగ వాతావరణం కనిపించాలని అధికారులు సూచించారు. విద్యార్థులను తరగతులకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అదే రోజు సత్కరించనున్నారు. జగనన్న విద్యా కానుక కిట్లనూ పంపిణీ చేస్తారు. విద్యా కానుకలకు సంబంధించిన సామగ్రి ఇప్పటికే పాఠశాలల సముదాయాలు, మండల విద్యా శాఖ కార్యాలయాలకు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి