logo

సమస్యల పరిష్కారానికి.. ‘మీ చెంతకే పీఎఫ్‌’

భవిష్యనిధి ఖాతాదారులకు, పింఛనుదారులకు, పీఎఫ్‌ సంస్థల యజమానులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి జులై 11వ తేదీన ‘మీ చెంతకే పీఎఫ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు భవిష్యనిధి సహాయ కమిషనర్‌ కె.వీరమణికాంత్‌ తెలిపారు.

Published : 29 Jun 2022 03:42 IST

కరాస, న్యూస్‌టుడే : భవిష్యనిధి ఖాతాదారులకు, పింఛనుదారులకు, పీఎఫ్‌ సంస్థల యజమానులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి జులై 11వ తేదీన ‘మీ చెంతకే పీఎఫ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు భవిష్యనిధి సహాయ కమిషనర్‌ కె.వీరమణికాంత్‌ తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు మర్రిపాలెం ప్రాంతీయ కార్యాలయంలో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. వివిధ పరిశ్రమల్లో పని చేసిన ఉద్యోగులు, యజమానులు వారి సమస్యల వివరిస్తూ జులై 5వ తేదీలోపు ‘నిధి ఆప్కే నికత్‌’ అని కవర్‌పై రాసి విశాఖపట్నం ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయం, మర్రిపాలెం చిరునామాకు పంపాలన్నారు. ఫ్యాక్స్‌ ద్వారా 0891-2558734, మెయిల్‌ ద్వారా vizag@epfindia.gov.inకు పంపొచ్చని సూచించారు.

* ఖాతాదారులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్నాహ్నం 1.00 వరకు, యజమానులకు (un–ex–assts) మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.00, యజమానులకు (ex–assts) సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సమయం కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని