చెత్త సేకరణ పంచాయితీ
విశాఖ నగరంలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించే క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) వాహనాల పని తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య నిర్వహణపై ఫిర్యాదులు వస్తుండడంతో జీవీఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
గుత్తేదారుకు నేరుగా నిధులు వేతనాలందలేదని చోదకుల నిరసన
జీవీఎంసీ పర్యవేక్షణ శూన్యం
న్యూస్టుడే, కార్పొరేషన్
తూనిక యంత్రంపై చెత్తసేకరణ వాహనం
విశాఖ నగరంలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించే క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) వాహనాల పని తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య నిర్వహణపై ఫిర్యాదులు వస్తుండడంతో జీవీఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
గుత్తేదారు చోదకులకు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో సోమవారం 120 వాహనాల సేవలను నిలిపివేశారు. చివరికి చెల్లించడానికి హామీ ఇవ్వడంతో మంగళవారం యథావిధిగా వాహనాలు నడిచాయి. చెత్త సేకరణ, తరలింపు కోసం మహా విశాఖ నగరపాలక సంస్థ ఎప్పటి నుంచో యూజర్ ఛార్జీలు వసూలు చేస్తోంది. అయితే అది తప్పని సరి కాకపోవడంతో గతంలో పారిశుద్ధ్య సిబ్బంది వచ్చినా, రాకపోయినా నగరవాసులు పెద్దగా పట్టించుకునేవారు కాదు.
*ప్రస్తుతం రుసుములు చెల్లించడం తప్పనిసరి కావడంతో చెత్త సేకరణ ఆగితే నివాసితులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* నగరంలో కొండవాలు, చిన్న వీధుల్లో 15శాతం నివాసాలు ఉన్నాయి. ఆయా ఇళ్ల వద్దకు క్లాప్ వాహనాలు వెళ్లవు. అక్కడి నుంచి పుష్కార్టుల ద్వారా సేకరించి బిన్నుల్లో వేస్తున్నారు. తర్వాత కాంపాక్టర్ బిన్ను వ్యానులతో దాన్ని డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. దీనికి నెలకు రూ.కోటి వరకు వ్యయమవుతోంది.
* మరో పక్క క్లాప్ వాహనాలకు నెలకు రూ.4.07కోట్లు చెల్లిస్తున్నారు. గతంలో నగరానికి చెందిన గుత్తేదారులు 412 వాహనాల్లో చెత్తను సేకరించేవారు. ప్రస్తుతం 618 క్లాప్ వాహనాలు నడుపుతున్నా చెత్త సేకరణపై ఫిర్యాదులు వస్తూనే ఉండడం గమనార్హం.
ఆ రుసుములు నేరుగా గుత్తేదారుకు..
క్లాప్ వాహనాల నిర్వహణపై గుత్తేదారులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. నగర ప్రజల నుంచి వసూలయ్యే చెత్త సేకరణ రుసుములు ప్రత్యేక ఖాతాలో జమ అవుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పర్యవేక్షణలో క్లాప్ వాహనాల గుత్తేదారులకు ఇస్తారు. జీవీఎంసీలోని ఆడిట అకౌంట్స్ విభాగాల ప్రమేయం లేకుండానే ప్రజల సొమ్ము నేరుగా గుత్తేదారుకు చేరేలా ఏర్పాట్లు చేశారు.
*సేవా రుసుములు సక్రమంగా వసూలు కాకపోతే... సాధారణ నిధుల నుంచి ఇవ్వాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు జీవీఎంసీని కోరుతున్నారు. ఇప్పటి వరకు సేవా రుసుముల కింద రూ.8 కోట్లు వసూలైందని, వీటి నుంచే గుత్తేదారుకు వెళతాయని ప్రధాన వైద్యాధికారి కేఎస్ఎల్జీ శాస్త్రి తెలిపారు.
జీవీఎంసీ డబ్బులు...‘స్వచ్ఛాంధ్ర’ పెత్తనం: రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలు చూడటానికి ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తీరుపై జీవీఎంసీ అధికారులు విస్తుపోతున్నారు. క్లాప్ వాహనాలకు ఎంత చెల్లించాలన్న అంశంపై ఆ సంస్థ అధికారులు తమకు నచ్చినట్లు గుత్తేదారుతో ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.65వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చోదకునికి రూ.10వేల వేతనం, పెట్రోలు ఖర్చు రూ.15వేలుగా చెబుతున్నారు. అయినా దానికి మూడింతల మొత్తం గుత్తేదారుకు ఇస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
పర్యవేక్షణ ఏదీ..
క్లాప్ వాహనాల జీపీఎస్ను జీవీఎంసీలోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించారు. ఆయా వాహనాలు ఉదయం 6 నుంచి 9.30 గంటల్లోపే చెత్తను సేకరిస్తాయి. అవి ఎన్ని ట్రిప్పులు, కిలోమీటర్లు తిరిగాయనే అంశాలను జీవీఎంసీలో పరిశీలించకపోవడం లోపమని నిపుణులు చెబుతున్నారు. తద్వారా గుత్తేదారు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ‘క్లాప్ వాహనాలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ బిల్లులు చెల్లిస్తుంది. ఆయా వాహనాల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరించేలా చూస్తున్నాం. ఒక్కో వాహనం 1000 ఇళ్ల నుంచి చెత్త తీసుకోవాలి. ట్రిప్పులెన్ని తిరిగాయన్న ప్రాతిపదికన కాకుండా ఇళ్ల నుంచి చెత్త సేకరించారా లేదా అనేది ప్రామాణికంగా తీసుకుంటున్నామ’ని జీవీఎంసీ మెకానికల్ విభాగ కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, సహాయ ఇంజినీరు సత్య శ్రీనివాసరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
[ 28-03-2024]
నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. -
ఆ వర్గాలకుసీట్లేవి?
[ 28-03-2024]
ఉమ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు. -
ప్రలోభాలపై నిఘా... ఉల్లంఘనలపై కఠిన చర్యలు
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
ఉత్తరం నుంచి మూడోసారి..
[ 28-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి త్రిముఖ వ్యూహంతో అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. -
ఘనంగా రామ్చరణ్ జన్మదిన వేడుకలు
[ 28-03-2024]
అనకాపల్లి పట్టణంలో సినీహీరో రామ్చరణ్ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. -
రాష్ట్రాభివృద్ధికే కూటమి పొత్తులు
[ 28-03-2024]
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైకాపాను ఓడించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. -
జనసేనలోకి వైకాపా నేత మన్యాల శ్రీనివాస్
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
విమ్స్లో రోగి సహాయకులపైనే భారం
[ 28-03-2024]
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో నాలుగో తరగతి సిబ్బంది పనితీరుపై రోజురోజుకీ విమర్శలు అధిక మవుతున్నాయి. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. -
సంపులో పడి సెక్యూరిటీ గార్డు మృతి
[ 28-03-2024]
విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటనపై బుధవారం దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. -
డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్టు
[ 28-03-2024]
డీజిల్ స్మగ్లింగ్ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!