కళ్లు చెదిరే వ్యాపారం.. తేడా వస్తే నిర్బంధం!
చీకటి వ్యాపారంలో కళ్లు చెదిరే నిజాలివి.. గంజాయి స్మగ్లింగ్లో మాఫియా కోణం.. పెద్ద క్రైమ్ సినిమాకు సరిపడా కథ.. స్థానికంగా గంజాయి తరలిస్తూ పట్టుబడి జైలుకు వెళ్లాడొక గిరిజనుడు.. జైల్లో మహారాష్ట్ర డాన్తో పరిచయం కావడంతో అంతర రాష్ట్ర స్మగ్లర్ అయ్యాడు
స్మగ్లర్ చెరలో రెండేళ్లుగా ఆరుగురు గిరిజనులు
విడిపించి తీసుకువచ్చిన ‘అల్లూరి’ జిల్లా పోలీసులు
గంజాయి స్మగ్లింగ్లో రూ. లక్షల్లో లావాదేవీలు
గంజాయి స్మగ్లర్ చెర నుంచి రక్షించిన గిరిజనులతో ఏఎస్పీ తుషార్డూడి, గూడెంకొత్తవీధి సీఐ అశోక్కుమార్
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే: చీకటి వ్యాపారంలో కళ్లు చెదిరే నిజాలివి.. గంజాయి స్మగ్లింగ్లో మాఫియా కోణం.. పెద్ద క్రైమ్ సినిమాకు సరిపడా కథ.. స్థానికంగా గంజాయి తరలిస్తూ పట్టుబడి జైలుకు వెళ్లాడొక గిరిజనుడు.. జైల్లో మహారాష్ట్ర డాన్తో పరిచయం కావడంతో అంతర రాష్ట్ర స్మగ్లర్ అయ్యాడు.. లావాదేవీలు లక్షల్లోకి చేరాయి.. చిన్న తేడా రావడంతో రెండేళ్లుగా ఆ డాన్ చెరలో చిక్కుకున్నాడు.. విడిపించడానికి వెళ్లిన భార్య, పిల్లలను కూడా అతడు నిర్బంధించగా.. చివరకు పోలీసులు వారిని విడిపించడంతో కథ సుఖాంతమైంది.. దీంతోపాటు లక్షల రూపాయల్లో సాగుతున్న గంజాయి లావాదేవీలు బయటపడ్డాయి. బీ చింతపల్లి ఏఎస్పీ తుషార్డూడి బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం ఏబులంకు చెందిన పాంగి గోవర్ధన్ 2020లో గంజాయి తరలిస్తూ కాకినాడ జిల్లా కోటనందూరులో పోలీసులకు పట్టుబడి రాజమండ్రి జైలుకు చేరాడు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్కు చెందిన గంజాయి స్మగ్లర్ సుభాష్ అన్నా పవార్తో అక్కడ పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు బెయిల్పై విడుదలైన గోవర్ధన్ స్వగ్రామానికి వచ్చేశాడు. సుభాష్ జైలు నుంచి విడుదలయ్యాక ఏబులం గ్రామానికి వచ్చాడు. స్థానికుడు గొల్లోరి హరిబాబు సాయంతో గోవర్ధన్ను కలిసి తనకు గంజాయి కావాలంటూ రూ.8 లక్షలు ఇచ్చాడు. దీంతో గోవర్ధన్, హరిబాబు కలిసి 1700 కిలోల గంజాయిని మహారాష్ట్రకు తరలించడానికి సిద్ధపడ్డారు.
* ఈ క్రమంలో కిర్లంపూడి చెక్పోస్టు వద్ద హరిబాబు పోలీసులకు పట్టుబడగా గోవర్ధన్ తప్పించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గంజాయి డాన్ సుభాష్ ఏబులం వచ్చి గోవర్ధన్ను బలవంతంగా మహారాష్ట్రకు తీసుకెళ్లి తన ఇంట్లో నిర్బంధించాడు. అతడిని విడిపించేందుకు భార్య ధనలక్ష్మి, ఇద్దరు పిల్లలను తీసుకుని తన మరిది కేశవ్, అతడి భార్యతో కలిసి 2021 డిసెంబరులో మహారాష్ట్ర వెళ్లింది. స్మగ్లర్ వీరిని కూడా బంధించాడు. రూ. 20 లక్షల విలువైన గంజాయి తీసుకొచ్చి ఇస్తే అందరినీ వదిలిపెడతానని చెప్పి కేశవ్ను పంపేశాడు. ఇక్కడకు వచ్చిన కేశవ్ గూడెంకొత్తవీధి పోలీసులను ఆశ్రయించి తన అన్న, వదిన, పిల్లలు, భార్యను నిర్బంధించిన విషయాన్ని చెప్పాడు. వారు ఈ విషయాన్ని ఎస్పీ సతీష్కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈనెల 25న మహారాష్ట్రకు పంపించారు. అక్కడి పోలీసుల సహకారంతో గంజాయి డాన్ను అదుపులోకి తీసుకుని గిరిజనులకు విడిపించారు.
* వీరితో పాటు రెండేళ్లుగా ఇదే స్మగ్లర్ చెరలో ఉన్న చింతపల్లి మండలం లోతుగెడ్డకు చెందిన గిరిజనుడు నాగేంద్రబాబుకు కూడా విముక్తి కల్పించారు. అతడి తమ్ముడు స్మగ్లర్ దగ్గర రూ. 7 లక్షలు తీసుకుని గంజాయి సరఫరా చేయకపోవడంతో రెండేళ్ల నుంచి అతడిని నిర్బంధించాడు. సుభాష్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని ఏఎస్పీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.