జగన్నాథుని రథోత్సవానికి వేళాయే..
విశాఖ పాతనగరం మెయిన్రోడ్డులోని శ్రీ జగన్నాథస్వామి దేవస్థానంలో స్వామి కల్యాణ, రథయాత్ర ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. గురువారం కల్యాణోత్సవం, జులై 1న తొలి రథయాత్ర నిర్వహిస్తారు. 158 ఏళ్ల నుంచి ఇక్కడ రథయాత్రను నిర్వహిస్తున్నారు.
స్వామి వారి యాత్రకు సిద్దమైన రధం
వన్టౌన్, న్యూస్టుడే: విశాఖ పాతనగరం మెయిన్రోడ్డులోని శ్రీ జగన్నాథస్వామి దేవస్థానంలో స్వామి కల్యాణ, రథయాత్ర ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. గురువారం కల్యాణోత్సవం, జులై 1న తొలి రథయాత్ర నిర్వహిస్తారు. 158 ఏళ్ల నుంచి ఇక్కడ రథయాత్రను నిర్వహిస్తున్నారు. పూరి ఆచారాన్ని అనుసరిస్తున్నాన్నారు. 1862లో జగన్నాథస్వామి ఆలయం ఏర్పడింది. 1864 నుంచి రథయాత్ర నిర్వహిస్తూ పదిరోజుల పాటు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజున ఉత్సవాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఆలయంలో భిన్న రకాల పూజలు నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు అంగరంగ వైభవంగా సుభద్రాదేవి కల్యాణం నిర్వహిస్తారు.
రోజుకో అవతారంలో దర్శనం
జులై 2 నుంచి స్వామివారు రోజుకో అవతారంలో దర్శనమివ్వనున్నారు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహవతారం, నృసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, బలరామ, కృష్ణావతారం, శేషపాన్పు అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. జులై 11న తిరుగు రథయాత్ర నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు పాగింగపల్లి జగన్నాథ ఆచార్యులు తెలిపారు. శ్రీరంగనాథస్వామి మూల విరాట్టుగా, ఉత్సవ మూర్తులుగా రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో కొలువై ఉన్నారు. జగన్నాథస్వామి, సుభద్రాదేవి, బలభద్రస్వామి, సుదర్శనస్వామి వార్లను అలంకరించి రథంపై టర్నర్ చౌల్ట్రీకి తీసుకెళ్లి దశావతారాల్లో అలంకరిస్తామని పేర్కొన్నారు.
శీల విరుపు ఉత్సవానికి ప్రత్యేకత
శీలవిరుపు మహోత్సవం జులై 5న నిర్వహిస్తామని జగన్నాథ ఆచార్యులు తెలిపారు. తోటకూర అమ్మే వ్యాపారి వేషంలో లక్ష్మీదేవి స్వామివారిని వెతుక్కుంటూ వెళ్లి ఆచూకీ తెలుసుకుంటారన్నారు. ఈ సందర్భంలో అలిగి, తిరిగి ఎలా వస్తావో చూస్తానని స్వామి వారి రథం శీలను తొలగిస్తారని, దీనినే శీల మహోత్సవం అంటారన్నారు. ఈ ఉత్సవాన్ని చౌల్ట్రీ ఆవరణలో వైభవంగా నిర్వహిస్తామన్నారు.
భక్తులకు సకల ఏర్పాట్లు
టర్నర్ చౌల్ట్రీ ఆవరణలోని కల్యాణమండపంలో దశావతారాలు నిర్వహించేందుకు ఈఓ ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. ఉచిత దర్శనాలతో పాటు ప్రత్యేక దర్శనానికి రూ.20, శీఘ్ర దర్శనానికి రూ.50, విశిష్ట దర్శనానికి రూ.200, అష్టోతర పూజకు రూ.20 టికెట్ ధర నిర్ణయించారు. దశావతరాలు జరిగే 9 రోజులూ గోత్ర నామాలతో పూజలు చేయించుకోవాలంటే రూ.500 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని ఈవో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత