పెట్టుబడి సాయం..ఇంకెంత దూరం!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్, రైతు భరోసా పథకాల పేరుతో అన్నదాతలకు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఏటా వేల మందికి ఈ సాయం దక్కకుండాపోతోంది. చాలామందికి రైతు భరోసా సాయం
సాంకేతిక చిక్కులతో పీఎం కిసాన్ లబ్ధి దూరం
మూడేళ్లలో 70 వేల మంది రైతులకు దరిచేరని పథకం
ఇటీవల రావికమతంలో పీఎం కిసాన్ సొమ్ములు రావడం లేదని ఎమ్మెల్యే ధర్మశ్రీకి వివరిస్తున్న దేవర మారమ్మ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్, రైతు భరోసా పథకాల పేరుతో అన్నదాతలకు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఏటా వేల మందికి ఈ సాయం దక్కకుండాపోతోంది. చాలామందికి రైతు భరోసా సాయం రూ.7,500 ఖాతాల్లో జమవుతోంది.. పీఎం కిసాన్ సొమ్ములు రూ.6 వేలు అంద[డం లేదు. ఉమ్మడి జిల్లాలో గతేడాది 30 వేల మంది రైతులకు ఈ ఆర్థిక సాయం వివిధ కారణాలను చూపి నిలిపేశారు. ఈ ఏడాది మొదటి విడతగా రూ.2 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే విడుదల చేసింది. అనకాపల్లి జిల్లాలో సుమారు 8,500 మందికి పైగా ఖాతాల్లో ఈ సాయం జమ కాలేదు. ఇటీవలే తుమ్మపాల రైతు సంఘ నాయకులు మురళీమోహనరావు అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి అర్హులైన రైతులందరి సాయం అందేలా చూడాలని కోరుతున్నారు.
ఇవీ అడ్డంకులు...
రైతు భరోసా మాదిరిగా కాకుండా కొన్ని అదనపు షరతులతో పీఎం కిసాన్ అందిస్తున్నారు. అందువల్లే చాలా మంది ఈ పథకం సాయం అందుకోలేకపోతున్నారు. ఒకే కుటుంబానికి చెందినవారు కావడం, చనిపోయిన రైతు ఖాతాలు, ప్రభుత్వ ఉద్యోగి/ పింఛనుదారు, గ్రామ/వార్డు సచివాలయ కుటుంబ సర్వేలో ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించడం, ప్రజాసాధికార సర్వేలో నమోదుకాకపోవడం, ఆదాయపన్ను చెల్లిస్తుండడం, వెబ్ల్యాండ్తో వివరాలు సరిపోకపోవడం, ఆన్సర్వేలో ఉండడం ఇలా 16 రకాల కారణాలతో పీ‡ఎం కిసాన్ను సాయాన్ని తిరస్కరిస్తున్నారు. ఇలాంటి వారిలో చాలామంది అర్హులుంటున్నా వారి సాయాన్ని పునరుద్ధరించుకోలేకపోతున్నారు.
అర్హులైనవారందరికీ సాయం..
పీఎం కిసాన్ సాయం అందని వారు మండల ఏవో కార్యాలయాలకు వెళితే ఏ కారణంతో సాయం అందలేదో వివరంగా చెబుతారు. అర్హులైతే ఆయా సమస్యలను సరిదిద్దుకుని వివరాలను అందజేస్తే వారికి పీఎం కిసాన్ సొమ్ములు అందుతాయి. ఇదివరకు ఆన్సర్వేలో ఉన్న రైతులు సర్వే చేయించుకుని వివరాలిస్తే వారి ఖాతాల్లో సర్కారు సాయం పడింది.
- లీలావతి, జిల్లా వ్యవసాయాధికారి, అనకాపల్లి
* ‘బాబూ రైతుభరోసా సొమ్ములు పడుతున్నాయి.. పీఎం కిసాన్ డబ్బులు రూ.6 వేలు మాత్రం పడడం లేదు.. ఇక్కడ అధికారుల్ని ఎన్నిసార్లు అడిగినా ఇదిగో..అదిగో అనడమే తప్ప డబ్బులు వచ్చేటట్లు చేయడం లేదు. మీరైనా ఒకసారి చెప్పండి బాబూ’
-రావికమతం మండలం
కవ్వకుంటలో ఇటీవల జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ ఎదుట దేవర మారమ్మ తన ఆవేదనను వెళ్లగక్కింది..
రెండేళ్లుగా నిలిచిపోయాయి..
గతంలో నాలుగు వాయిదాలు పీఎం కిసాన్ సాయం మా ఖాతాలో పడింది. గడిచిన రెండేళ్లుగా ఈ సాయం అందడం లేదు. సచివాలయం, వ్యవసాయ శాఖ అధికారులకు దృష్టికి తీసుకువెళ్లినా సమాధానం చెప్పడం లేదు. పీఎం కిసాన్ హెల్ప్లైన్ సెంటర్కి ఫోన్ చేసి అడిగితే వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయని చెబుతున్నారు, డబ్బులు ఎందుకు రావడం లేదో చెప్పడం లేదు.
- పల్లెల రమణమ్మ, వమ్మవరం, ఎస్.రాయవరం మండలం
ఈనాడు డిజిటల్, అనకాపల్లి
గత మూడేళ్లలో పీఎం కిసాన్ అందని వారి వివరాలు
ఏడాది సాయం
దక్కని వారు
2019-20 2,253
2020-21 29,162
2021-22 30,939
2022-23 8,686
తొలివిడత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: కేఏ పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు