logo

తెదేపా బలోపేతానికి కృషి

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం తెదేపా శ్రేణుల ఆత్మీయ సమావేశం అచ్యుతాపురం మండలం

Published : 30 Jun 2022 06:10 IST

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం తెదేపా శ్రేణుల ఆత్మీయ సమావేశం అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ వద్ద బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గంటా మాట్లాడుతూ తెలుగుదేశం బలమైన పార్టీ అన్నారు. వైకాపా ప్రభుత్వం మూడేళ్లలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పార్టీలో కలిసికట్టుగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గంలో టిక్కెట్టు ఎవరికి ఇచ్చినా కలసికట్టుగా అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు. వచ్చే ఏడాది ఎన్నికల వచ్చే అవకాశం ఉన్నందున రెట్టింపు ఉత్సాహంతో నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. వైకాపా పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. తెదేపా సీనియర్‌ నేత లాలం భాస్కరరావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధిస్తుందన్నారు. కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని కోరారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, తెదేపా నాయకులు విజయబాబు, కోయిలాడ వెంకట్‌, అక్కిరెడ్డి జగదీశ్‌, పైల ముత్యాలనాయుడు, ఈతపాకల సుజాత, ఎన్‌ఆర్‌ఐ కృష్ణ, బొల్లేపల్లి లలిత కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం గంటాను సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని