ధరల మంట.. నడక తంటా
వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంలో మార్పులు అటు అంగన్వాడీలపై భారంగా మారడంతో పాటు అటు లబ్ధిదారులను వ్యయ ప్రయాసలకు గురిచేస్తున్నాయి. ఈనెల నుంచి ఇళ్లకు పౌష్ఠికాహారం ఇవ్వొద్దని, అందరికీ అంగన్వాడీ కేంద్రంలోనే వండిపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మె
అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం కోసం పాట్లు
ఈనాడు డిజిటల్ అనకాపల్లి, న్యూస్టుడే, అనకాపల్లి
బాక్సులో భోజనం పెట్టుకుంటున్న గర్భిణి
వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంలో మార్పులు అటు అంగన్వాడీలపై భారంగా మారడంతో పాటు అటు లబ్ధిదారులను వ్యయ ప్రయాసలకు గురిచేస్తున్నాయి. ఈనెల నుంచి ఇళ్లకు పౌష్ఠికాహారం ఇవ్వొద్దని, అందరికీ అంగన్వాడీ కేంద్రంలోనే వండిపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మెనూ ఛార్జీలు పెంచకుండా వండిపెడితే జీతం డబ్బులు కూడా సరిపోవని అంగన్వాడీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మరోవైపు లబ్ధిదారులు కూడా కేంద్రానికి వెళ్లి భోజనం చేయలేమని, దూరభారంగా, వసతుల్లేని కేంద్రాలకు ఎలా వెళ్లేదని ప్రశ్నిస్తున్నారు.
వసతి కొరత..దూరాభారం.. : ఉమ్మడి జిల్లాలోని చాలా అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు లేవు. గర్భిణులు, బాలింతలు కూర్చోవడానికి వీలులేని కేంద్రాలు ఎక్కువే ఉన్నాయి. చాలా కేంద్రాల్లో మరుగుదొడ్ల సదుపాయం లేదు. కొన్ని కేంద్రాలలో తినలేక క్యారేజీలు తెచ్చుకుంటున్నారు.
పాలు, గుడ్లు, నూనె, బియ్యం ప్రభుత్వమే కేంద్రాలకు సరఫరా చేస్తుంది. కూర తయారీకి అవసరమైన కూరగాయలు, పోపు సామగ్రిని అంగన్వాడీ నిర్వాహకులే కొనుగోలు చేయాలి. దీనికోసం ప్రభుత్వం మనిషికి రోజుకు కూరగాయలకు రూపాయిన్నర, రవాణా ఛార్జీలుగా 27 పైసలు, గ్యాస్కు అర్ధ రూపాయి చెల్లిస్తుంది. ఈ మొత్తం ఎంతమాత్రం సరిపోదని అంగన్వాడీ కార్యకర్తలంటున్నారు. ప్రస్తుతం గ్యాస్ ధర రూ.1,050 ఉంది. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మెనూ ఛార్జీలు పెంచి వసతులు కల్పించాలని అప్పుడే వండిపెట్టగలమని ఇటీవల అంగన్వాడీ కార్యకర్తలు అనకాపల్లి కలెక్టర్, ఐసీడీఏసీ పీడీకి విన్నవించారు.
పాతపద్ధతే మేలు..
అంగన్వాడీ కేంద్రానికి మా ఇంటికి దూరం ఎక్కువ. ప్రస్తుతం ఆరో నెల. కేంద్రానికి నడిచిరావడం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కూర్చుని తిందామంటే కుర్చీలు లేవు. నేలపై కూర్చోలేకపోతున్నాను. నెలలు నిండిన కొద్దీ నడిచి కేంద్రానికి రావడం కష్టం. పాత విధానమే అమలు చేయాలి..
- బి.హేమలత, రచ్చబండ్ల, గవరపాలెం
శస్త్రచికిత్సలైన బాలింతలు ఎలా వస్తారు.. :
మా అమ్మాయికి ఇటీవలే కేజీహెచ్లో పెద్ద ఆపరేషన్ చేశారు. ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటోంది. మూడు నెలల వరకు ఎక్కడకు వెళ్లొద్దని వైద్యులు చెప్పారు. ఇక్కడేమో కేంద్రం వద్దకు వస్తేనే కోడి గుడ్డు ఇస్తాం, భోజనం పెడతాం అంటున్నారు. ఆపరేషన్ చేసుకున్న ఆమె ఎలా నడిచి వస్తుంది. కనీసం క్యారేజీ తెచ్చుకుంటాం ఇమ్మన్నా ఇవ్వడం లేదు. - జి.లక్ష్మి, దిబ్బవీది, అనకాపల్లి
ఇబ్బందుల్లేకుండా అమలుచేయాలి..:
సంపూర్ణ పోషణ పథకం కేంద్రాల దగ్గరే అమలు చేయాలి. గర్భిణి, బాలింతలకు ఇబ్బంది లేకుండా ఈ పోషకాహారాన్ని వండిపెట్టాలి. కొవిడ్కు ముందు బాగానే అమలుచేశారు. ఇప్పుడెందుకు సమస్య వస్తుంది?.. గ్యాస్ రేటు బాగా పెరగడం వాస్తవమే.. ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఎవరికీ ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలుచేయాలి.
- సీతామహలక్ష్మి, పీడీ, ఐసీడీఎస్, అనకాపల్లి లబ్ధిదారుల వివరాలు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్