అద్దె బస్సులకు తపస్సు!!
అద్దె బస్సులిచ్చే గుత్తేదారుల నిమిత్తం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎదురు చూస్తోంది. సొంతంగా బస్సులు సమకూర్చుకునే పరిస్థితి లేకపోవడం, మరో వైపు అద్దె బస్సులు సమకూరకపోవడంతో
ముందుకొచ్చే గుత్తేదారులెవరంటూ ఎదురుచూపులు
న్యూస్టుడే, కార్పొరేషన్
ద్వారకా బస్స్టేషన్లో బస్సులు
అద్దె బస్సులిచ్చే గుత్తేదారుల నిమిత్తం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎదురు చూస్తోంది. సొంతంగా బస్సులు సమకూర్చుకునే పరిస్థితి లేకపోవడం, మరో వైపు అద్దె బస్సులు సమకూరకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఆలోచనలో పడ్డారు. గతంలో ఏడాదిలో కనీసం పది కొత్త బస్సులైనా నగరానికి కేటాయించేవారు.
గత మూడేళ్లుగా కొత్త బస్సులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అద్దె బస్సుల కోసం ఆర్టీసీ కొత్తగా ఆన్లైన్ టెండర్ విధానం ప్రవేశ పెట్టింది. ఇప్పటి వరకు ఎంత మంది గుత్తేదారులు దరఖాస్తు చేసుకున్నారనే విషయంపై స్పష్టత రాలేదు.
* మొత్తం 61 బస్సుల ప్రతిపాదన: విశాఖకు మొత్తం 61 అద్దె బస్సులు ప్రతిపాదించారు. అందులో సింహాచలం డిపోనకు 12, వాల్తేరుకు 12, కూర్మన్నపాలెం (సీˆ్టల్సిటీ)కి 12, మద్దిలపాలెంకు రెండు, గాజువాక డిపోనకు 8 బస్సులు కేటాయించగా, మిగతావి విశాఖపట్నం-1 డిపోనకు కేటాయించారు. నగర పరిధిలో తిరిగే బస్సుల కేఎంపీల్ (కిలోమీటర్ పర్ లీటర్) 5.41గా నిర్ణయించారు.
* నేడు అవగాహన: ఆర్టీసీకి అద్దె బస్సులివ్వడానికి సిద్ధంగా ఉన్న గుత్తేదారులకు ఎంవీపీకాలనీ బస్స్టాండు కార్యాలయంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించి, వారి అనుమానాలను నివృత్తి చేయనున్నట్లు సీటీఎం సత్యనారాయణ తెలిపారు. టెండరులో ఎలా పాల్గొనాలి, రివర్స్ టెండరింగ్తోపాటు ఇతర అంశాలపైనా అధికారులు గుత్తేదారులకు సమాచారం ఇస్తారని చెప్పారు.
డీజిల్ భారం ఆర్టీసీˆదే..
డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆర్టీసీకి అద్దె బస్సులివ్వడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో ఆర్టీసీ యాజమాన్యమే డీజిల్ ఇచ్చేలా టెండరు నిబంధనల్లో మార్పు చేశారు. అయినా గుత్తేదారులు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. ముఖ్యంగా నగర పరిధిలో కేఎంపీల్ లక్ష్యం చేరుకోకపోతే గుత్తేదారు ఆర్టీసీకి అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
* విపరీతమైన ట్రాఫిక్, సిగ్నళ్లు, ఎక్కడిక్కడ బస్స్టాపులతో ఉన్న నగరంలో సిటీ బస్సులు కేఎంపీఎల్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని పలువురు గుత్తేదారులు భావిస్తున్నారు. మరో వైపు గుత్తేదారులు టెండరులో అధిక ధర కోట్ చేస్తే ఆర్టీసీ ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు.
* అవసరమైతే రివర్స్ టెండర్లు పిలిచి ఎంపికైనవారికి రూట్లు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే కిలోమీటరుకు ఎంత మొత్తం చెల్లిస్తారనే అంశాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
[ 25-04-2024]
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట