అవి అడ్డగోలు నియామకాలే..!
అనకాపల్లి గ్రామీణ సహకార విద్యుత్తు సంఘం (రెస్కో)ని గతేడాది మార్చిలోనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి ఈపీడీసీఎల్ పరిధిలోకి తీసుకువచ్చారు. అప్పటివరకు ఇందులో 509 మంది వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోకి వచ్చాక ఎలాంటి నియామకం చేయాలన్నా డిస్కం అనుమతులు ఉండాలి.
కాంట్రాక్ట్ సిబ్బంది పేరుతో రెస్కోలో పోస్టింగులు
అనకాపల్లి ఆర్ఈసీఎస్ కార్యాలయం
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: అనకాపల్లి గ్రామీణ సహకార విద్యుత్తు సంఘం (రెస్కో)ని గతేడాది మార్చిలోనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి ఈపీడీసీఎల్ పరిధిలోకి తీసుకువచ్చారు. అప్పటివరకు ఇందులో 509 మంది వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోకి వచ్చాక ఎలాంటి నియామకం చేయాలన్నా డిస్కం అనుమతులు ఉండాలి. దీన్ని పట్టించుకోకుండా అధికార పార్టీ నేతలు కొందరు తమకు తెలిసిన వారి దగ్గర రూ. లక్షలు వసూలు చేసి ఒప్పంద సిబ్బందిగా నియమించినట్లు ఆరోపణలున్నాయి. ఈపీడీసీఎల్ను పక్కన పెట్టి వీరికి జూన్, జులైల్లో జీతాలు కూడా చెల్లించినట్లు తెలిసింది. ఇటీవల ఈఆర్సీ ఆదేశాల మేరకు రెస్కో చేసిన రూ.5.13 కోట్ల అనధికార ఖర్చుపై విచారణ చేపట్టినప్పుడు 33 మందిని అనధికారికంగా నియమించుకున్నట్లు వెలుగుచూసింది. దీంతో వారికి ఈ నెల జీతాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. అయితే ఒకటి, రెండు నెలల్లో రెస్కో తిరిగి సహకార శాఖ పరిధిలోకి వచ్చేస్తుందని నేతలు నమ్మబలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జీతాలివ్వకపోయినా తర్వాత బకాయిలతో కలిపి ఇస్తామని, ఎవరూ బయటపడవద్దని సొమ్ములు వసూళ్లు చేసిన నేతలు బుజ్జగిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా చాలామందికి విద్యార్హత లేకపోయినా సొమ్ములిస్తే పదోన్నతులిచ్చేశారు.. ఇంజినీరింగ్ అధికారులుగానూ నియమించిన దాఖలాలూ ఉన్నాయి. ఈ అక్రమాలపై ఇదివరకే ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
* ఈపీడీసీఎల్లో విలీనం చేస్తే ఇలాంటి అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయనే రెస్కోని సహకార రంగంలో కొనసాగేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా లైసెన్స్ పునరుద్ధరణ జరిగేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెస్కో ఎండీ కృష్ణంరాజు పదవీ కాలం కూడా గతేడాది డిసెంబర్తోనే ముగిసిపోయింది. మాతృశాఖ నుంచి పొడిగింపు ఉత్తర్వులు లేకుండానే ఇక్కడ కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు అనధికారికంగా తీసుకున్న జీతం సొమ్ములు కూడా రికవరీ చేశారు. ఈ విషయమై రెస్కో వ్యవహారాలు చూస్తున్న ఈపీడీసీఎల్ ఈఈ రాజశేఖర్ వద్ద ప్రస్తావించగా అనధికారికంగా నియమించుకున్నట్లు గుర్తించిన వారికి జీతాలు ఆపేశామని స్పష్టం చేశారు. వారి నియామకాలను నిరూపించుకోవాలని సూచించామన్నారు. సరైన పత్రాలను సమర్పించలేకపోయారని, వారికి ఇదివరకు జీతాలు ఇచ్చుంటే వాటినీ రికవరీ చేస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: కేఏ పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే