స్వాతంత్య్ర ఉద్యమంలో అనకాపల్లి
అనకాపల్లి జిల్లాకు చెందిన ఎంతో మంది త్యాగమూర్తులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని బానిసత్వ సంకెళ్లు తెంచేందుకు తమ వంతు పోరాటం చేశారు. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే లక్ష్యంతో ఉద్యమాలు చేసి కారాగారాల్లో నెలల తరబడి మగ్గిపోయారు. స్వాతంత్య్ర సమరంలో కీలక ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం,
అనకాపల్లి, న్యూస్టుడే
అనకాపల్లి జిల్లాకు చెందిన ఎంతో మంది త్యాగమూర్తులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని బానిసత్వ సంకెళ్లు తెంచేందుకు తమ వంతు పోరాటం చేశారు. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే లక్ష్యంతో ఉద్యమాలు చేసి కారాగారాల్లో నెలల తరబడి మగ్గిపోయారు. స్వాతంత్య్ర సమరంలో కీలక ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా పోరాటంలో అనకాపల్లికి చెందినవారు పాలుపంచుకున్నారు.
* ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మాగాంధీ పిలుపునందుకొని పట్టణానికి చెందిన డాక్టరు గుళ్లపల్లి నారాయణమూర్తి, గాంధేయవాధి కోరుకొండ బుచ్చిరాజు ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. దీంతో బ్రిటిష్ పాలకులు బుచ్చిరాజును 1930 మే 29న అరెస్టు చేసి బరంపురం, బళ్లారి జైళ్లలో ఏడాది ఉంచారు. నారాయణమూర్తిని ఆకేపురం, బళ్లారి జైళ్లలో ఆరునెలలు ఉంచారు.
* శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న కొడుకుల సూర్యనారాయణను 1932 ఫిబ్రవరి 19న అరెస్టు చేసి మద్రాసు జైలులో ఉంచారు. 1941 మార్చి 15న మరోసారి అరెస్టు చేసి అల్లిపురం జైలులో ఎనిమిది నెలలు ఉంచారు. ఆయన కుమారులు కొడుకుల సోమన్న, జోగారావు సైతం తండ్రి బాటలో నడిచారు. బ్రిటిష్ వారిని ఎదిరించినందుకు వారిని తిరుచురాపల్లి, ఆలీపూర్ జైలులో ఉంచారు. గాంధీ పిలుపునందుకొని 1941 జనవరి 31న మాజీ ఎంపీ మిస్సుల సూర్యనారాయణ తన స్వగ్రామమైన కొండకర్లలో సత్యాగ్రహం చేపట్టారు. శాసనోల్లంఘనకు పాల్పడ్డారని అరెస్టు చేసి బళ్లారి వద్ద ఉన్న అల్లిపురం క్యాంపు జైలులో తొమ్మిది నెలలు ఉంచారు. వంద రూపాయిలు జరిమానా విధించారు.
* 1942లో నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమంలో జక్కినపల్లి శ్రీరామమ్మూర్తి, కోరిబిల్లి జోగారావు పాల్గొని బళ్లారి వద్ద ఉన్న అల్లిపురం జైలులో శిక్ష అనుభవించారు. మాజీ ఎమ్మెల్యేలు కె.గోవిందరావు, భీశెట్టి అప్పారావు, స్థానిక ఉద్యమకారుడు కందిరిశెట్టి సుబ్బారావు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 11 నెలలు పాట్నా జైలులో శిక్ష అనుభవించారు. కొడుకుల కామేశ్వరమ్మ నెల్లూరు జైలులో మూడునెల జైలు శిక్ష అనుభవించారు. మున్సిపల్ ఉన్నతపాఠశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
* కశింకోట ఆర్ఈసీఎస్ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే పి.వి.రమణ సైతం స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. పోలీసుల దాడి నుంచి పలు పర్యాయాలు తప్పించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు