తాళం పడిందా.. సొత్తు గోవిందా..
ఏదైనా ఇంటికి తాళం వేసి ఉంటే చాలు.. దాన్ని చాకచక్యంగా పగలగొట్టి దొంగతనానికి పాల్పడతారు. ఇలాంటి ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకొన్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మంగాపురంకాలనీ దరి
దొంగతనానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు
స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ల్యాప్టాప్లు
ఎం.వి.పి.కాలనీ, పెదవాల్తేరు, న్యూస్టుడే : ఏదైనా ఇంటికి తాళం వేసి ఉంటే చాలు.. దాన్ని చాకచక్యంగా పగలగొట్టి దొంగతనానికి పాల్పడతారు. ఇలాంటి ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకొన్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మంగాపురంకాలనీ దరి నివాసముంటున్న షేక్ పర్వీన్ ఈనెల 3వ తేదీన ఇంటికి తాళం వేసి పి.ఎం.పాలెంలోని పుట్టింటికి వెళ్లారు. ఈనెల 6న పర్వీన్ నివాసంలో అద్దెకు ఉంటున్న రామారావు ఫోన్చేసి ఇంటి తాళాలు తీసి ఉన్నాయని, వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నట్లు సమాచారం ఇవ్వటంతో వెంటనే వచ్చి పరిశీలించగా, 14 తులాల బంగారు ఆభరణాలు, 250 తులాల వెండి వస్తువులు, రెండు ల్యాప్టాప్లు కనిపించలేదు. దొంగతనం జరిగినట్లుగా గుర్తించి ఎంవీపీకాలనీ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాత నేరస్తుల వివరాలతో విచారణ చేపట్టారు. ఈనెల 8న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జేఆర్.నగర్ రోడ్డులో పాత నేరస్తులైన కొమ్మాదికి చెందిన మరడ సాయి(24), వేపగుంటకు చెందిన షణ్ముఖరావు(19)ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. మరడ సాయి జల్సాలకు అలవాటుపడి డబ్బులకోసం రాత్రుళ్లు తిరుగుతూ.. ఇళ్లకు తాళాలు వేసి ఉంటే చాలు దొంగతనానికి పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. షణ్ముఖరావుతో కలిసి ఈనెల 5న అర్ధరాత్రి ఈ దొంగతనానికి పాల్పడట్టు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి, వారి నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా