విశాఖ జిల్లా కలెక్టర్లు...124
స్వాతంత్య్రం రాక మునుపే విశాఖ జిల్లా ఏర్పడింది. బ్రిటీష్, డచ్ పాలకులు తమ అవసరాల నిమిత్తం విశాఖను వాణిజ్య కేంద్రంగా వినియోగించుకొనేవారు.
1950లో జిల్లా జనాభా 1.05 లక్షలు..
న్యూస్టుడే, వన్టౌన్
స్వాతంత్య్రం రాక మునుపే విశాఖ జిల్లా ఏర్పడింది. బ్రిటీష్, డచ్ పాలకులు తమ అవసరాల నిమిత్తం విశాఖను వాణిజ్య కేంద్రంగా వినియోగించుకొనేవారు. అప్పటిలో జిల్లా పాలన వ్యవహారాలు విశాఖ కేంద్రంగా సాగేవి. నాడు విశాఖను వైజాగ్పటంగా పిలిచేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలోని అయిదు జిల్లాలతో పాటు ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు విశాఖ జిల్లా పరిధిలో ఉండేవి. కాలక్రమేణ ఆయా ప్రాంతాలు విశాఖ నుంచి వీడి కొత్త జిల్లాలుగా అవతరించాయి.
* బ్రిటీషు పాలనలో జిల్లా పాలిత కేంద్రంగా విశాఖ కొనసాగింది. జిల్లాకు 1803వ సంవత్సరం నుంచి కలెక్టర్లు సేవలు అందించారు. 124వ కలెక్టర్గా ఎ.మల్లికార్జున కొనసాగుతున్నారు.
* ఒడిశా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే 1936లో విశాఖ జిల్లా పరిధిలోని కటక్, బిసమ్, జైపూర్, కోరాపుట్, మల్కన్గిరి, నౌరంగాపూర్, పొట్టంగి, రాయగడ వంటి ప్రాంతాలు ఆ రాష్ట్ర పరిధిలోకి వెళ్లాయి. గంజాం జిల్లా పరిధిలోని సోంపేట, టెక్కలి, శ్రీకాకుళం ప్రాంతాలు విశాఖ జిల్లా పరిధిలోకి వచ్చాయి.
* స్వాతంత్య్రం తర్వాత 1950లో శ్రీకాకుళం, 1979లో విజయనగరం జిల్లా ఏర్పాడ్డాయి. ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజన కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి 11 మండలాలు, అనకాపల్లి జిల్లాలోకి 24 మండలాలు వెళ్లగా ప్రస్తుతం విశాఖ జిల్లా 11 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు, 25 లక్షల జనాభాతో కొనసాగుతోంది. 1048 చదరపు కిలోమీటర్ల పరిధిలో జిల్లా విస్తరించి ఉంది.
కలెక్టరేట్ భవన నిర్మాణానికి 49 ఏళ్లు..
చెక్కుచెదరని కట్టడంగా కలెక్టరేట్ భవనం కొనసాగుతోంది. అయిదు ఎకరాల విస్తీర్ణంలో ఆంగ్ల అక్షరం ఇ ఆకారంలో జి+1 తరహాలో భవనాన్ని నిర్మించారు. 1865లో మొదలైన ఈ భవన నిర్మాణం పూర్తి కావడానికి 49 ఏళ్లు పట్టింది. 1914 ఆగస్టు 15న కలెక్టరేట్ భవనం ప్రారంభమైంది. గ్యానన్ అండ్ డంకర్లరీ సంస్థ నిర్మించింది. పూర్తి రాతికట్టడంతో నిర్మించిన ఈ భవనానికి బర్మా నుంచి రప్పించిన కర్రను వినియోగించారు. పైకప్పునకు బంగ్లా పెంకులను వాడారు. భారత ప్రభుత్వ పురావస్తుశాఖ ఈ భవనాన్ని పురాతన కట్టడంగా గుర్తించింది. స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఇక్కడ కలెక్టరేట్ కొనసాగేది.
జిల్లా జనాభా అంతకంతకు పెరుగుతోంది. ఉపాధి అవకాశాలు అధికంగా ఉండడంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి అనేక మంది వలస వస్తూ విశాఖలో స్థిరపడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంటే 1950లో జిల్లా జనాభా 1,05,000 మంది ఉంటే 2022 నాటికి 22.78లక్షలకు చేరింది. ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా వివరాలను పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలో పెరుగుదల ఇలా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?