రాఖీ కట్టొస్తానని తిరిగిరాని లోకాలకు..
రాఖీ కట్టొస్తానని తిరిగిరాని లోకాలకు.. లారీ ఢీకొని తల్లీ కుమారుడి దుర్మరణం అన్నయ్యలకు రాఖీ కట్టి వద్దామని బయల్దేరిన మహిళ కుమారుడితో సహా మృత్యుఒడికి చేరింది. దుడ్డుపాలెం గ్రామ సమీపాన గురువారం తెల్లవారుజామున ఈ హృదయవిదారక ఘటన జరిగింది
లారీ ఢీకొని తల్లీ కుమారుడి దుర్మరణం
భార్య సత్యవతి మృతదేహం వద్ద రోదిస్తున్న భర్త రాంబాబు
రాఖీ కట్టొస్తానని తిరిగిరాని లోకాలకు.. లారీ ఢీకొని తల్లీ కుమారుడి దుర్మరణం అన్నయ్యలకు రాఖీ కట్టి వద్దామని బయల్దేరిన మహిళ కుమారుడితో సహా మృత్యుఒడికి చేరింది. దుడ్డుపాలెం గ్రామ సమీపాన గురువారం తెల్లవారుజామున ఈ హృదయవిదారక ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లీ కొడుకులను లారీ రూపంలో మృత్యువు బలితీసుకుంది.
ఎస్సై విభీషణరావు కథనం ప్రకారం.. సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ పెద్దయాతపాలెం గ్రామానికి చెందిన శరగడం సత్యవతి (35)కి భర్త రాంబాబు, ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె కుందన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కుమారుడు సుఖీష్రామ్ విశాఖలో ఇంటర్ పూర్తి చేశాడు. మరో రెండు రోజుల్లో చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్లో చేర్చాలనుకున్నారు. సత్యవతి పుట్టిల్లు మునగపాక. ఈమెకు ముగ్గురు అన్నయ్యలు బొడేటి అప్పలనాయుడు, జగ్గారావు, ఈశ్వరరావు ఉన్నారు. మునగపాకలో ఈమె వాటాగా వచ్చిన రెండెకరాల్లో వరిసాగు చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో ఊడుపుల నిమిత్తం కుమారుడు సుఖీష్రామ్ (19)తో బైక్పై సత్యవతి పుట్టింటికి గురువారం తెల్లవారుజామునే బయలుదేరారు. వ్యవసాయ పనులు చూసుకొని శుక్రవారం సోదరులు ముగ్గురికి రాఖీ కట్టి వస్తానని భర్తకు, బంధువులకు చెప్పింది. మరికొద్దిసేపట్లో వెంకన్నపాలెం జంక్షన్లో ఆగి టిఫిన్ చేద్దామని తల్లీ,కుమారుడు అనుకున్నారు.
* దుడ్డుపాలెం జంక్షన్ సమీపానికి వచ్చేసరికి వెంకన్నపాలెం నుంచి నర్సాపురం ఇసుక ర్యాంపు వద్దకు వెళ్తున్న లారీ ఎదురుగా రాంగ్రూట్లో వచ్చి వీరి బైకును ఢీకొంది. వీరిద్దరిని కొంతదూరం ఈడ్చుకు పోయింది. గాయపడి కొనఊపిరితో ఉన్న వారిని వదిలేసి లారీ డ్రైవర్ రమణ అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు లారీ కింద ఉన్న సుఖీష్రామ్ను బయటకు లాగారు. లారీ అతడి మెడపై నుంచి వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కొద్దిసేపటికే తల్లితోపాటు కుమారుడు ప్రాణాలు విడిచారు. భార్యాబిడ్డా ఒకేసారి దూరమయ్యారంటూ సత్యవతి భర్త రాంబాబు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
* పెదయాతపాలెంలో విషాదఛాయలు: మృతిచెందిన తల్లి, కుమారుడి మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం సాయంత్రం పెదయాతపాలెం తీసుకురావడంతో మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.