logo

ఒడిశా గవర్నర్‌తో ఈఎన్‌సీ చీఫ్‌ భేటీ

తూర్పు నావికాదళం(ఈఎన్‌సీ) ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌, వైస్‌అడ్మిరల్‌ బిశ్వజిత్‌దాస్‌ గుప్తా గురువారం ఒడిశా గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషిలాల్‌తో సమావేశమయ్యారు

Published : 12 Aug 2022 06:07 IST

ఒడిశా గవర్నర్‌ గణేషిలాల్‌తో ఈఎన్‌సీ చీఫ్‌ బిశ్వజిత్‌దాస్‌ గుప్తా

సింధియా, న్యూస్‌టుడే : తూర్పు నావికాదళం(ఈఎన్‌సీ) ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌, వైస్‌అడ్మిరల్‌ బిశ్వజిత్‌దాస్‌ గుప్తా గురువారం ఒడిశా గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషిలాల్‌తో సమావేశమయ్యారు. ఈనెల 10న ఐఎన్‌ఎస్‌ చిలకాలో ఆ రాష్ట్ర తీరప్రాంత రక్షణ, భద్రతపై అపెక్స్‌ కమిటీ సమీక్షలో పాల్గొన్న ఈఎన్‌సీ చీఫ్‌ ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా గవర్నర్‌తో భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో అగ్నివీర్‌ బ్యాచ్‌ శిక్షణకు ఐఎన్‌ఎస్‌ చిలకా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయా కార్యకలాపాలపై, రక్షణ అంశాలపై చర్చించినట్టు నేవీ వర్గాలు స్పష్టం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని