logo

అక్టోబర్‌ 5లోగా చెల్లింపులు

హిందుస్థాన్‌ షిప్‌యార్డులో 2019-20 ఆర్థిక ఏడాది లీవు ఎన్‌క్యాష్‌మెంట్‌ బకాయిలు అక్టోబర్‌  5వ తేదీలోగా చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించిందని సంస్థ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బి.సత్యానందరావు తెలిపారు. శుక్రవారం 61వ వార్డు గ్రామ మండలిలో నిర్వహించిన

Published : 13 Aug 2022 04:35 IST

సింధియా, న్యూస్ట్‌టుడే: హిందుస్థాన్‌ షిప్‌యార్డులో 2019-20 ఆర్థిక ఏడాది లీవు ఎన్‌క్యాష్‌మెంట్‌ బకాయిలు అక్టోబర్‌  5వ తేదీలోగా చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించిందని సంస్థ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బి.సత్యానందరావు తెలిపారు. శుక్రవారం 61వ వార్డు గ్రామ మండలిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021-22 ఏడాదికి సంబంధించిన మొత్తాలను ఈ ఏడాది డిసెంబర్‌లోగా సభ్యులకు చెల్లించాలని యాజమాన్యానికి విన్నవించామన్నారు. ప్రతినిధులు జి.అప్పారావు, బి.వి.పాత్రో, కె.అప్పలరాజు, తిరుపతిరావు, ఎన్వీ.రమణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని