చేసిందే ప్రజలకు ధైర్యంగా చెబుతున్నాం
తమ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు ధైర్యంగా చెప్పే అవకాశాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి కల్పించారని, అందుకే ప్రతి ఇంటికి వెళ్లి పలకరించగలుగుతున్నామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. రైవాడ శివారు శ్రీరాంపురం, శంభువానిపాలెం గ్రామాల్లో శుక్రవారం జరిగిన గడపగడపకు మన
రాఖీ కట్టిన రైవాడ సచివాలయ మహిళా ఉద్యోగులను ఆశీర్వదిస్తున్న ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు
దేవరాపల్లి, న్యూస్టుడే: తమ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు ధైర్యంగా చెప్పే అవకాశాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి కల్పించారని, అందుకే ప్రతి ఇంటికి వెళ్లి పలకరించగలుగుతున్నామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. రైవాడ శివారు శ్రీరాంపురం, శంభువానిపాలెం గ్రామాల్లో శుక్రవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు తమ ప్రభుత్వం ద్వారా అందిన పథకాలపై ఆరా తీశారు. ప్రభుత్వం ద్వారా ఆయా కుటుంబాలకు చేకూరిన ఆర్థిక లబ్ధికి సంబంధించిన పత్రాల సంపుటిని అందజేశారు. శ్రీరాంపురంలో ఈశ్వర డ్వాక్రా సంఘానికి రుణ మాఫీ కాలేదని డ్వాక్రా మహిళలు అడగ్గా, వెంటనే అక్కడే ఉన్న వెలుగు ఏపీఎం ప్రభాకర్ని పిలిపించి దీనిపై ప్రశ్నించారు. శ్రీరాంపురంలో రోడ్డు మధ్యలో అడ్డదిడ్డంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను పక్కకు మార్చాలని ఏఈఈ శంకరరావును ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలకు వెళ్లి పిల్లలతో కాసేపు మాట్లాడారు. శుక్రవారం రాఖీ పండగ కావడంతో అనేకమంది మహిళలు ముత్యాలనాయుడుకు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం, సర్పంచి చల్లా లక్ష్మి, ఉప ఎంపీపీ ఉర్రూకల గంగాభవాని, మాజీ ఎంపీపీ భాస్కరరావు, మండల వైకాపా అధ్యక్షుడు బాబూరావు, మాజీ సర్పంచి తాతయ్యలు తదితరులు పాల్గొన్నారు.
దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ముత్యాలనాయుడు హితవు పలికారు. రైవాడ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల వైరల్ అయిన ఎంపీ మాధవ్ వీడియో అసలుది కాదంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప స్పష్టం చేసినా, తెదేపా నాయకులు ఇంకా వైకాపా నాయకులపై బురదజల్లే ప్రయత్నం కొనసాగించడం సిగ్గుచేటన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్