logo

వచ్చిన నాలుగు గంటల్లోనే మృత్యుఒడికి

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మినతి గొమాంగో కుమారుడు విశాఖలో జరిగిన ఓ ప్రమాదంలో మృతిచెందాడు. ఎంవీపీ స్టేషన్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. కొత్తూరు మాజీ ఎమ్మెల్యే (కాంగ్రెస్‌) మినతి గొమాంగో కొంతకాలంగా పిల్లల చదువుల

Published : 16 Aug 2022 06:49 IST

మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

సంఘటనా స్థలంలో కుమారుడి మృతదేహం వద్ద విలపిస్తున్న మాజీ ఎమ్మెల్యే మినతి గొమాంగో

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మినతి గొమాంగో కుమారుడు విశాఖలో జరిగిన ఓ ప్రమాదంలో మృతిచెందాడు. ఎంవీపీ స్టేషన్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. కొత్తూరు మాజీ ఎమ్మెల్యే (కాంగ్రెస్‌) మినతి గొమాంగో కొంతకాలంగా పిల్లల చదువుల కోసం విశాఖ డాక్టర్స్‌ కాలనీలో నివాసముంటున్నారు. ఆమె పెద్ద కుమారుడు రిషి గొమాంగో అలియాస్‌ తన్మయి (21) పంజాబ్‌లో బి.ఎస్‌.సి. అగ్రికల్చర్‌ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో భవనంపై నుంచి కిందపడి మృతిచెందాడు. సి.ఐ ప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
సమీప భవనం నుంచేనా?: ఆదివారం రాత్రి ఊరి నుంచి వచ్చిన తన్మయి తాము ఉండే భవనంలో కాకుండా సమీపంలో ఉన్న మరో భవనంపై స్నేహితులతో కలిసి ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉన్నారనే విషయంపై పూర్తి కారణాలు తెలియలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని