Vizag: ఉత్కంఠ రేపిన కళాకారిణి అదృశ్యం.. ఆచూకీ కోసం పరుగులు పెట్టిన పోలీసులు
విశాఖ నగరంలో ప్రముఖ కళాకారిణి, స్వరరంజని సంస్థ అధ్యక్షురాలు జవ్వాది లక్ష్మి(54) అదృశ్యమైన ఘటనతో పోలీసులు పరుగులు తీశారు. నగరంలో ఇటీవల వరుసగా జరుగుతున్న నేర ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు వివిధ మార్గాల్లో అన్వేషించారు.
ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తింపు
జవ్వాది లక్ష్మి(54)
ఈనాడు, విశాఖపట్నం, పీఎంపాలెం, న్యూస్టుడే: విశాఖ నగరంలో ప్రముఖ కళాకారిణి, స్వరరంజని సంస్థ అధ్యక్షురాలు జవ్వాది లక్ష్మి(54) అదృశ్యమైన ఘటనతో పోలీసులు పరుగులు తీశారు. నగరంలో ఇటీవల వరుసగా జరుగుతున్న నేర ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు వివిధ మార్గాల్లో అన్వేషించారు. చివరికి ఆమె క్షేమంగా ఉన్నట్లు తేలింది. ఇంట్లో భర్తకు చెప్పకుండా హైదరాబాద్ వెళ్లినట్లు శనివారం రాత్రి 9.30 గంటలకు నిర్ధారణ అయింది. కొన్ని రోజుల క్రితం ఓ యువతి విశాఖ తీరంలో సాగరంలో మునిగి గల్లంతయిందని భావించిన నావికాదళ బృందం ప్రత్యేకంగా హెలీకాప్టర్లతో గాలించింది. అయితే...ఆమె సముద్రంలో మునిగిపోలేదని, భర్తను మోసగించి బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో..పోలీసుల దర్యాప్తుతో జవ్వాది లక్ష్మి సంఘటన కూడా నగరంలో చర్చనీయాంశమయింది.
* విశాఖ ద్వారకానగర్లోని పౌరగ్రంథాలయంలో శుక్రవారం రాత్రి జవ్వాది లక్ష్మిని ఓ సంస్థ ఘనంగా సన్మానించింది. కార్యక్రమం అనంతరం రాత్రి 8.45 గంటల సమయంలో మరో కళాకారిణి చంద్రకళతో కలిసి షేర్ ఆటోలో ఇంటికి బయలుదేరారు. చంద్రకళ ఆదర్శనగర్ కూడలిలో దిగిపోయారు. అనంతరం ఆటో మధురవాడ వైపు వెళ్లింది. కానీ లక్ష్మి ఇంటికి చేరలేదు. బీ శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చే సమయంలో భర్త వేణుగోపాల్ ఇంట్లో లేకపోవడంతో ఆయన సెల్కు ఆమె వాట్సప్లో మాటల సందేశం పంపారు. మరో మహిళతో కలిసి ఆటోలో వెళ్తున్నానని, 9.30గంటలకల్లా వచ్చేస్తానని అందులో పేర్కొన్నారు. ఆమె వస్తుందన్న ఉద్దేశంతో భర్త తలుపులకు గడియ కూడా పెట్టలేదు. ఆమె కోసం ఎదురుచూస్తూ నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు మెలకువ వచ్చి ఇంట్లో చూడగా భార్య కనపడకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్లో ఉన్న తన కుమారుడు సాయిరాం సాగర్కు, స్వరరంజని సభ్యులకు ఫోన్ చేశారు. ఆమె శుక్రవారం రాత్రి వెళ్లిన తరువాత తమతో మాట్లాడలేదని చెప్పారు. ఆమెతో ప్రయాణించిన చంద్రకళతో మాట్లాడగా ఆదర్శనగర్లో తాను దిగిపోయానని చెప్పారు. లక్ష్మి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనన్న అనుమానంతో వేణుగోపాల్ శనివారం ఉదయం పి.ఎం.పాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీపీ శ్రీకాంత్ పోలీసు అధికారులందరితో సమావేశం ఏర్పాటుచేశారు. నగరంలోని పలు నిఘా కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆమె ప్రయాణించిన ఆటోను గుర్తించినా దానిపై రిజిస్ట్రేషన్ నెంబరు కనపడలేదు. ఇతర మార్గాల్లో ఆమె ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించారు. పి.ఎం.పాలెం సీఐ వై.రామకృష్ణ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో గాలించారు.
రాత్రి 9.30గంటలకు ఫోన్: లక్ష్మి కనిపించడం లేదన్న విషయాన్ని వేణుగోపాల్ హైదరాబాద్లో ఉంటున్న కుమారుడికి తెలియజేశారు. దీంతో అతను విశాఖకు బయలుదేరారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో విజయవాడ వచ్చేసరికి.. లక్ష్మి హైదరాబాద్లోని కుమారునికి ఇంటికి వచ్చినట్లు సమాచారం అందింది. ఆమె క్షేమంగా ఉందని తెలియడంతో పోలీసులు, కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖలో భర్తకు చెప్పకుండా...కుమారునికి కూడా ముందుగా చెప్పకుండా హైదరాబాద్ ఎందుకు వెళ్లారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
శుక్రవారం రాత్రి సన్మానం అందుకున్న జవ్వాది లక్ష్మి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?