logo

నడిరోడ్డు మీద పులి ప్రత్యక్షం!

సబ్బవరం - చోడవరం రహదారిలో బంగారమ్మపాలెం వద్ద శనివారం రాత్రి 7 గంటల సమయంలో పులి ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 25 Sep 2022 05:21 IST

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం - చోడవరం రహదారిలో బంగారమ్మపాలెం వద్ద శనివారం రాత్రి 7 గంటల సమయంలో పులి ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరానికి చెందిన డి.రామకృష్ణ అతని అల్లుడు రాణాపతి గణేష్‌, కుమార్తె సాయి కలసి విశాఖపట్నం నుంచి స్వగ్రామానికి కారులో వెళ్తున్నారు. రాత్రి ఏడు గంటల సమయంలో బంగారమ్మపాలెం వద్ద పులి రోడ్డు దాటుతుండగా వారికి కనిపించింది. కారును చూసి పులి రోడ్డు మధ్యలో నిలబడటంతో వారంతా భయాందోళన చెందారు. పెద్దగా హారన్‌ కొట్టడంతో పక్కనున్న అడివిలోకి వెళ్లిపోయిందన్నారు. అనంతరం ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పడంతో వారంతా పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సీఐ రంగనాథం బంగారమ్మపాలెం చేరుకుని గ్రామస్థులందరినీ అప్రమత్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని