తిన్నదెంత.. తిరిగిచ్చిందెంతా?
ఉపాధిహామీ పథకం అమల్లోకి వచ్చి 15 ఏళ్లయింది. ఈ పథకం కింద చేపట్టిన పనులపై ఏటా సామాజిక తనిఖీలు నిర్వహించి అక్రమాలను గుర్తిస్తున్నారు. బాధ్యులైన వారికి తాఖీదులు జారీచేసి వివరణలు తీసుకుంటున్నారు. వాటిపై సంతృప్తి చెందకుంటే రికవరీలకు ఆదేశిస్తున్నారు.
సామాజిక తనిఖీల్లో గుర్తించినా చర్యలేవీ?
ఈనాడు డిజిటల్, అనకాపల్లి: ఉపాధిహామీ పథకం అమల్లోకి వచ్చి 15 ఏళ్లయింది. ఈ పథకం కింద చేపట్టిన పనులపై ఏటా సామాజిక తనిఖీలు నిర్వహించి అక్రమాలను గుర్తిస్తున్నారు. బాధ్యులైన వారికి తాఖీదులు జారీచేసి వివరణలు తీసుకుంటున్నారు. వాటిపై సంతృప్తి చెందకుంటే రికవరీలకు ఆదేశిస్తున్నారు. అలా ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటికి 12 రౌండ్లలో తనిఖీలు పూర్తయ్యాయి. ఈ పదిహేనేళ్లలో ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.43.50 కోట్ల మేర నిధుల వినియోగంలో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇందులో రికవరీ చేయదగింది ఎంతో పూర్తిగా తేల్చలేకపోయారు. ఇప్పటివరకు రూ.11.68 కోట్లు రికవరీకి ఆదేశించినా.. అందులో 50 శాతం కూడా అక్రమార్కుల నుంచి రాబట్టలేకపోయారు. మరో రూ.30 కోట్ల తేడాలకు సంబంధించి అక్రమమెంతో తేల్చాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాలో గత 13 ఏళ్లలో రూ.35.50 కోట్ల ఉపాధి నిధుల వినియోగంలో తేడాలు గుర్తించారు. గత రెండేళ్లలోనే సుమారు రూ.18 కోట్ల మేర అవకతవకలు చోటుచేసుకోవడం విశేషం.
మస్తర్ల మాయాజాలం, కొలతల్లో తేడాలు, బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, నాటిన మొక్కలు కనిపించకపోవడం, చేసిన పనులకు సంబంధించి దస్త్రాలను చూపకపోవడం వంటి అభియోగాలున్నాయి. వీటిలో వాస్తవమేంటో తేల్చాకే అక్రమార్కుల నుంచి రికవరీలు చేపట్టాలి. ఈ ప్రక్రియలోనే అంతులేని జాప్యం జరుగుతోంది. కొవిడ్ కారణంగా గత రెండేళ్లలో సామాజిక తనిఖీలను పూర్తిస్థాయిలో చేపట్టలేకపోయారు. బాధ్యులుగా గుర్తించిన వారిపై వ్యక్తిగత విచారణలు చేయలేకపోయారు. దీంతో ఎవరెవరి నుంచి ఎంత మొత్తంలో రికవరీ చేయాలో స్పష్టం కాలేదు. ఈలోగా ఉన్నతాధికారులు, నేతలతో పైరవీలు చేయించుకుని రూ.లక్షల్లో ఉండే రికవరీ మొత్తాలను రూ.వేలల్లోకి మార్చుకుంటూ కొంతమంది అక్రమాల నుంచి బయటపడుతున్నారు.
అక్రమాల్లో కొన్ని ఇలా..
* డీఆర్డీఏ ద్వారా చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్లో రూ.1.79 కోట్లు మేర అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీల్లో గుర్తించారు. ఇందులో కేవలం రూ.37.09 లక్షల మాత్రమే రికవరీ చేయగలిగారు. మరో రూ.20 లక్షలు అభియోగాలను రద్దుచేశారు. అయినా ఇంకా రూ.1.21 కోట్లు బాధ్యుల నుంచి రికవరీ చేయాల్సి ఉన్నా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
* రోలుగుంట మండలం నిండుగొండలో గ్రామంలో లేనివారి పేర్లు, జీడిపిక్కల కంపెనీలో పనిచేసేవారి పేరున మస్తర్లు వేసి భారీగా ఉపాధి వేతనాలు దారి మళ్లించారు. జానకీరామపురంలో ఓ ఉపాధ్యాయుడు, ఆర్మీ సిపాయి పేర్లతో కూడా మస్తర్లు వేసి సొమ్ము స్వాహా చేశారని గుర్తించారు. రావికమతం మండలంలోనూ ఈ తరహా అక్రమాలు వెలుగుచూశాయి.
* ఏజెన్సీలోని చింతపల్లి, పాడేరు, డుంబ్రిగుడ మండలాల్లో గతంలో యంత్రాలతో పనులు చేసి కూలీల పేరిట మస్తర్లు వేసి సొమ్ములు స్వాహాకు పాల్పడ్డారు. మరుగుదొడ్ల సొమ్ములు సొంత ఖాతాలకు మళ్లించేసుకున్నారు. ఇద్దరు ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్నా సొమ్ములు వెనక్కి రాబట్టలేకపోయారు.
నిరంతర ప్రక్రియ : సామాజిక తనిఖీల్లో గుర్తించిన కొన్ని సాంకేతికపరమైన అంశాలకు సిబ్బందిని బాధ్యులుగా చేయడానికి వీలవ్వదు. వారిపై అభియోగాలను తొలగించడానికి రికవరీ మొత్తం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. కొవిడ్తో కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు అన్ని మండలాల్లోనూ గత రెండేళ్లలో చేపట్టిన పనులపై విచారణలు జరిపిస్తున్నాం. రికవరీ శాతం బాగానే ఉంది. - సందీప్, డ్వామా పీడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి