భూములిచ్చినవారి బాధ పట్టదా?
భూమే ఆధారంగా బతికే సన్న, చిన్నకారు రైతులు... ఎకరా, రెండు ఎకరాలతో జీవనం సాగిస్తున్న బడుగు జీవుల వద్ద ఇళ్ల స్థలాల కోసమంటూ ప్రభుత్వం భూములు సేకరించింది. తీసుకున్న భూమికి బదులు ల్యాండ్పూలింగ్లో
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాచేస్తున్న నిర్వాసితులు (పాతచిత్రం)
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: భూమే ఆధారంగా బతికే సన్న, చిన్నకారు రైతులు... ఎకరా, రెండు ఎకరాలతో జీవనం సాగిస్తున్న బడుగు జీవుల వద్ద ఇళ్ల స్థలాల కోసమంటూ ప్రభుత్వం భూములు సేకరించింది. తీసుకున్న భూమికి బదులు ల్యాండ్పూలింగ్లో భాగంగా అభివృద్ధి చేసిన ఇళ్ల స్థలాలు జిరాయితీగా ఇస్తామని ప్రకటించింది. ఈ మాటలు నమ్మి భూములిచ్చిన వారంతా నేడు లబోదిబోమంటున్నారు. తమకు ఇస్తామన్న స్థలాలు ఎప్పుడిస్తారంటూ మూడేళ్లగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సేకరించిన భూముల్లో లే అవుట్లు వేయడం పూర్తయినా నిర్వాసితులకు మాత్రం ఇప్పటికీ న్యాయం జరగలేదు.
జీవీఎంసీ పరిధిలో నివసిస్తూ సొంతగూడు లేనివారికి నవరత్నాలు... పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వారికి సెంటు చొప్పున స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మూడేళ్ల క్రితం అనకాపల్లి మండలంలోని 13 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ విధానం కింద సుమారు 790 మంది వద్ద 1098.01 ఎకరాలు సేకరించారు. భూ సేకరణ సమయంలో డీఫారం పట్టా భూమి ఉన్న రైతులకు ఎకరాకి 18 సెంట్లు, ఆక్రమిత భూముల్లో ఉన్నవారికి 9 సెంట్ల చొప్పున అభివృద్ధి చేసిన స్థలాలు జిరాయితీగా ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. సేకరించిన భూములను వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి లేఅవుట్లుగా మార్చారు. ఎంపిక చేసిన పేదలకు సెంటు చొప్పున స్థలాలను కేటాయించారు. అనకాపల్లి పట్టణ వాసులతోపాటు విశాఖ నగరంలో ఉన్నవారికి స్థలాలు కేటాయించి పట్టా మంజూరు ప్రక్రియ పూర్తిచేశారు. కానీ భూములిచ్చిన వారిని సంగతే మరిచిపోయారు. వీరికి సెంటు స్థలం కూడా ఇంకా అప్పగించలేదు. ప్రభుత్వాన్ని నమ్మి జీవనాధారమైన భూములు ఇస్తే తమ గోడు పట్టించుకోవడమే మానేశారని వీరంతా ఆవేదన చెందుతున్నారు. 790 మంది ల్యాండ్ పూలింగ్ బాధితులంతా ఇప్పుడు పనులు మానుకుని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
మమ్మల్ని పట్టించుకోవడం లేదు- రమణమ్మ, సంపతిపురం
ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చాం. ఎకరాకి 18 సెంట్లు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. మేమిచ్చిన భూముల్లో లే అవుట్లు వేశారు. ఎక్కడెక్కడి వారికో ఇస్తున్నారు. భూములు ఇచ్చిన మా సంగతి ఏంటని అడుగుతుంటే పట్టించుకోవడం లేదు. మా సమస్యను పరిష్కరించాలి.
ముందు మా సమస్య తీర్చాలి - కె.కొండబాబు, కూండ్రం
ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన మాకు ప్రత్యామ్నాయం చూపించి అప్పుడు పట్టాలు ఇవ్వాలి. ముందు మా సమస్య తీర్చకుండా సెంటు చొప్పున భూమిని ఇచ్చి పట్టాలు అందిస్తున్నారు. మాకు న్యాయం చేయకుంటే పోరాటం చేస్తాం, సమస్యను పరిష్కరించేలా అధికారులు దృష్టి పెట్టాలి. లేకుంటే మా భూమిలోకి వచ్చే వారికి అడ్డుకుంటాం.
న్యాయం చేస్తాం. - చిన్నికృష్ణ, అనకాపల్లి ఆర్డీఓ
ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినవారికి న్యాయం చేస్తాం. వారికి ప్రత్యామ్నాయం చూపించేలా వీఎంఆర్డీఏ నుంచి అభివృద్ధి చేసిన భూమిలోనే స్థలాలు ఇస్తాం. వారితో మాట్లాడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టే చర్యలు తీసుకుంటాం. లేఅవుట్లు పూర్తయ్యాయి. ముందుగా కుదుర్చుకన్న అంగీకారం ప్రకారం భూములిచ్చిన వారికి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన స్థలాలు అందిస్తాం. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..