అత్యవసరమైతే అవస్థలే..!
సిటీ సర్వీసుల్లో పనిచేసే మహిళా కండక్టర్ల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఉదయం 5 గంటలకు విధుల్లోకి వచ్చి 8 గంటలపాటు నిలువుకాళ్లపై నిలబడి పని చేస్తారు. తరువాత డిపోకెళ్లి నిధులు, టికెట్లు అప్పగించి తిరిగి ఇంటికి చేరుకోవడానికి
మహిళా కండక్టర్ల యాతన
న్యూస్టుడే, ద్వారకానగర్ (కార్పొరేషన్)
ఇరుకు గదిలోనే సిబ్బంది
సిటీ సర్వీసుల్లో పనిచేసే మహిళా కండక్టర్ల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఉదయం 5 గంటలకు విధుల్లోకి వచ్చి 8 గంటలపాటు నిలువుకాళ్లపై నిలబడి పని చేస్తారు. తరువాత డిపోకెళ్లి నిధులు, టికెట్లు అప్పగించి తిరిగి ఇంటికి చేరుకోవడానికి దాదాపు 11 గంటల సమయం పడుతుంది. ఈ మధ్యలో అత్యవసరమైతే వారి బాధలు వర్ణనాతీతం. ఒక్కోసారి బస్సులను ట్రాఫిక్ రద్దీ లేని శౌచాలయం వద్ద నిలపాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. నిత్యం ఇబ్బందులు పడుతున్నా పీడీటీ అధికారులు పట్టించుకోవడం లేదని మహిళా కండక్టర్లు మండిపడుతున్నారు.
సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం
నగరంలో మధురవాడ, మద్దిలపాలెం, వాల్తేరు, సింహాచలం డిపోలకు చెందిన 82 సర్వీసులు పాత పోస్టాఫీసుకు వెళతాయి. అవి రద్దీగా ఉండే ప్రాంతాలైన ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబకూడలి, పూర్ణమార్కెట్, ఏవీఎన్ కళాశాల, కేజీహెచ్, కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్తు, పోస్టాఫీసు వంటి ప్రాంతాలమీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఆయా బస్సులన్నీ నిత్యం ప్రయాణికులతో నిండిపోతాయి. వాటిల్లో 40 మంది వరకు మహిళా కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. పాతపోస్టాఫీస్ చివరి బస్స్టాపు కావడంతో ప్రతి బస్సు 5 నిమిషాల నుంచి 10 నిమిషాలపాటు ఇక్కడ వేచి ఉంటాయి. అయితే అక్కడ సిబ్బంది మూత్ర విసర్జనకు సరైన ఏర్పాట్లు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
* పాతపోస్టాఫీసు బస్స్టాప్ వద్ద గల నిరీక్షణ గదిలో కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. వాటికి వాడుకనీటి సదుపాయం లేదు. దీంతో మున్సిపల్ కుళాయి నీటినే ఉపయోగిస్తున్నారు. ఆ నీరు రోజూ అరగంట పాటు మాత్రమే సరఫరా అవుతోంది. ఒక్కో సారి పది రోజులపాటు నీటి సరఫరా ఉండటంలేదని సిబ్బంది చెబుతున్నారు. ఆయా సందర్భాల్లో భోజనాలకు ఉపయోగించే నీటినే మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. మరుగుదొడ్లను సైతం శుభ్రం చేయకపోవడంతో అపరిశుభ్రంగా ఉంటున్నాయి.
* మరుగుదొడ్లు సక్రమంగా లేవని, నీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఓ మహిళా కండక్టర్ పేర్కొన్నారు. అత్యవసరమైతే ట్రాఫిక్ లేని ప్రాంతాల్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్ వద్ద బస్సు నిలపాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రయాణికులున్నా బసు నిలిపాల్సి రావడంతో ఇబ్బందిగా ఉంటోందని చెబుతున్నారు. పాత పోస్టాఫీసు వద్ద సిబ్బంది వేచి ఉండే గదికి వాడుక నీటి సరఫరా కోసం బోరు తవ్వించాలని అభిప్రాయపడ్డారు.
సమస్యల్ని పరిష్కరిస్తాం.. - ఎం.సత్యనారాయణ, డిప్యూటి సీటీఎం (అర్బన్)
ఆర్టీసీ మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు మాదృష్టికి వచ్చాయి. పాతపోస్టాఫీసు బస్స్టాప్ వద్ద ఉన్న సిబ్బంది నిరీక్షణ గదిని పరిశీలించి సౌకర్యాలు కల్పిస్తాం. మరుగుదొడ్లకు నీటిని సరఫరా చేసే యంత్రానికి మరమ్మతులు చేయిస్తున్నాం. రెండు రోజుల్లో ఇబ్బందులన్నింటినీ పరిష్కరిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ