మందుల అమ్మకాలపై మరింత నిఘా
జిల్లాలో ఔషధాల తనిఖీ అధికారులకు ఎట్టకేలకు శాశ్వత ప్రాతిపదికపై సొంత కార్యాలయ భవనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఏర్పాటు చేయనున్నారు. దీంతో మందుల అమ్మకాలపై నిఘా మరింత పక్కాగా
అందుబాటులో తనిఖీ అధికారులు
నర్సీపట్నం, న్యూస్టుడే: జిల్లాలో ఔషధాల తనిఖీ అధికారులకు ఎట్టకేలకు శాశ్వత ప్రాతిపదికపై సొంత కార్యాలయ భవనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఏర్పాటు చేయనున్నారు. దీంతో మందుల అమ్మకాలపై నిఘా మరింత పక్కాగా నిఘా పెట్టేందుకు వీలవుతుంది. ఇన్నాళ్లు డ్రగ్ ఇన్స్పెక్టర్లంతా అద్దె గదుల్లో కొనసాగుతున్నారు. వీరికి ఇప్పుడు పక్కా భవనాలు సమకూరుతున్నాయి. నర్సీపట్నంలో ఇప్పటికే ఇది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అనకాపల్లిలో నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఔషధ తనిఖీ అధికారులంతా ఇప్పటివరకు మందుల దుకాణాల పర్యవేక్షణ, వాటిలో నకిలీ ఔషధాలు అమ్మకుండా నిరోధించే పనులకే పరిమితమయ్యారు. వీరిని ఇప్పుడు జనం అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి సర్కారు వైద్యాలయాల్లోనే వీరికి కార్యాలయాలను నిర్మిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 భవనాలు వీరి కోసం సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్హెచ్ఎం) ఇందుకోసం నిధులు విడుదల చేసింది. ఏడాది క్రితం చేపట్టిన వీటి పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఇన్నాళ్లు అద్దె చెల్లిస్తూ చాలీచాలని ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్న వీరికి ఇక సౌకర్యవంతమైన, విశాలమైన భవనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటే ఔషధాలపై మరింత నిఘా పెట్టేందుకు మార్గం సుగమం కానుంది.
నర్సీపట్నంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఔషధ తనిఖీ అధికారి కార్యాలయ భవనం
జిల్లాలోని నర్సీపట్నం, అనకాపల్లిలో ఎన్హెచ్ఎంకు చెందిన మొత్తం రూ. 80 లక్షల నిధులతో ఔషధ తనిఖీ అధికారులకు పక్కా కార్యాలయాల భవనాలు ఏర్పాటవుతున్నాయి. తొలుత అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో మాత్రమే దీనిని నిర్మించాలని భావించారు. ఇటీవల అనకాపల్లి ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో నర్సీపట్నంలోనూ దీనిని నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతో 150 పడకల ప్రాంతీయ ఆసుపత్రి వెనుక భాగంలో చేపట్టిన ఇది ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ భవనాల్లో శీతలీకరణ సదుపాయం తదితర హంగులు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటి వరకు అద్దె గదులకు ఏటా రూ. లక్షలు వెచ్చిస్తున్నారు. పక్కా సొంత భవనాలతో ఇక ఈ సొమ్ము అంతా ప్రభుత్వానికి ఆదా కానుంది.
త్వరలో భవనం స్వాధీనం -ఎన్.యుగంధర్, ఔషధ తనిఖీ అధికారి, నర్సీపట్నం
నర్సీపట్నంలో పూర్తయిన భవనాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకోనున్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చేతులమీదుగా దీనిని ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇది ప్రారంభమైతే కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆసుపత్రి రోగులతోపాటు 17 మండలాల్లోని వారంతా ఔషధాలకు సంబంధించిన ఏ ఫిర్యాదు అయినా ఇక్కడ అందజేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులో సీఎం... ఎండలో జనం
[ 24-04-2024]
సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
పునరావాసం.. పచ్చి మోసం
[ 24-04-2024]
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
యువతా.. ఓటుకు తరలిరండి..
[ 24-04-2024]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. -
కూపన్లపై పెట్రోలు, డీజిల్ పోయడం కోడ్ ఉల్లంఘనే: జేసీ
[ 24-04-2024]
రాజకీయ పార్టీలు జారీ చేసే కూపన్ల ఆధారంగా పెట్రోలు, డీజిల్ పోస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయా పెట్రోలు బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?
[ 24-04-2024]
జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్ పాలకు ఐదేళ్లయింది. -
కోలాహలంగా విష్ణుకుమార్రాజు నామినేషన్
[ 24-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు నామినేషన్ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగనన్న వస్తే తప్పని తిప్పలు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. -
కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
విశాఖ లోక్సభ స్థానానికి మూడు నామపత్రాలు
[ 24-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. -
సోషల్ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి
[ 24-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. -
మాట తప్పారు.. మడమ తిప్పారు..
[ 24-04-2024]
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్