logo

‘వైకాపా పాలనకు అద్దం పడుతున్న రహదారులు’

వైకాపా పాలన తీరుకు రహదారుల పరిస్థితి అద్దం పడుతోందని మాడుగుల తెదేపా ఇన్‌ఛార్జి పి.వి.జి.కుమార్‌ అన్నారు. ఆదివారం ఆయన తెదేపా శ్రేణులతో కలిసి ఆనందపురం-దేవరాపల్లి రోడ్డును పరిశీలించారు.

Published : 26 Sep 2022 05:22 IST

ఆనందపురం వద్ద గుంతలు పడిన రోడ్డును పరిశీలిస్తున్న పీవీజీ కుమార్‌, తెదేపా నాయకులు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: వైకాపా పాలన తీరుకు రహదారుల పరిస్థితి అద్దం పడుతోందని మాడుగుల తెదేపా ఇన్‌ఛార్జి పి.వి.జి.కుమార్‌ అన్నారు. ఆదివారం ఆయన తెదేపా శ్రేణులతో కలిసి ఆనందపురం-దేవరాపల్లి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కుమార్‌ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి సొంత మండలంలోనే దేవరాపల్లికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారైందన్నారు. అసంపూర్తి పనులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకోలేదన్నారు. తెదేపాను విమర్శించడం ఉప ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నారే తప్ప.. అభివృద్ధిపై దృష్టి సారించలేదని విమర్శించారు. తెదేపా నాయకులు బోజంకి సూర్యనారాయణ, సిరికి రమణ, జగన్నాథం, జూరెడ్డి రాము, అప్పలనాయుడు, నారాయణమూర్తి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు