వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం
వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతాయని నగరంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల అభిప్రాయం
మాట్లాడుతున్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వర్సిటీ మాజీ వీసీ ఆచార్య లజపతిరాయ్
ఈనాడు-విశాఖపట్నం, న్యూస్టుడే-ఎంవీపీకాలనీ: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతాయని నగరంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. విశాఖలోని ఓ ఫంక్షన్హాల్లో ‘వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్టేబుల్ సమావేశం’ పేరిట ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పాలన వికేంద్రీకరణ కారణంగా ఒనగూరే ప్రయోజనాలను వారు వివరించారు. అనేక వనరులతో రాజధానికి సిద్ధంగా ఉన్న నగరంలో విశాఖ ఒకటని అభిప్రాయపడ్డారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయ మాజీ వీసీ ఆచార్య లజపతిరాయ్ ఈ కార్యక్రమ అధ్యక్షుడిగా ప్రసంగిస్తూ పాలన వికేంద్రీకరణ అన్నది కొత్త అంశమేమీ కాదన్నారు. విశాఖను రాజధానిగా చేయాలన్న ప్రతిపాదన ఆంధ్రరాష్ట్రం ఏర్పడే సమయంలోనే వచ్చిందన్నారు. 1953లో ఒకసారి, 1956లో మరోసారి విశాఖ పేరు తెరపైకి వచ్చిందని, అసెంబ్లీలో దానిపై చర్చలు కూడా జరిగాయని, తరువాత కాలంలో మారిపోయాయని గుర్తుచేశారు. ఆయా అంశాలకు సాక్ష్యంగా నాడు పత్రికల్లో ప్రచురితమైన కథనాలను ఆయన ప్రదర్శించారు.
* ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్కుమార్ మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు టి.డి.ఎల్.పి. సమావేశం జరగ్గా 42 శాతం మంది విశాఖకే మద్దతు పలికారన్నారు. కాకపోతే గుంటూరు, విజయవాడ నగరాలు కావాలని కోరుకున్న వారి శాతం ఎక్కువగా ఉండడంతో ఆ రెండు నగరాల మధ్య రాజధాని ఏర్పాటు చేశారని... తాను మాత్రం విశాఖే రాజధానిగా ఉండాలని చెప్పానని గుర్తుచేశారు.
* నాగార్జున విశ్వవిద్యాలయ మాజీ వీసీ ఆచార్య బాలమోహన్దాస్ మాట్లాడుతూ అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్న విశాఖను రాజధానిగా మార్చడానికి అందరూ మద్దతు తెలపాలన్నారు. రాజధాని నిర్మాణం కోసం అనేక కమిటీలు కూడా విశాఖ అనుకూలమని అభిప్రాయపడ్డాయని గుర్తుచేశారు.
* సెంచూరియన్ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ విశాఖ నగరం రెడీమేడ్ రాజధానిలాంటిదన్నారు. విశాఖలో అన్ని వసతులతోపాటు అనేక పరిశ్రమలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు.
* ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు కృష్ణమోహన్ మాట్లాడుతూ విశాఖలో పరిపాలన రాజధానితోపాటు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు.
* రచయిత చందు సుబ్బారావు మాట్లాడుతూ విశాఖలో రాజధాని ఏర్పాటుచేస్తే దానంతటదే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
* ఉత్తరాంధ్ర రక్షణ సమితి ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో కూడా అనేక మంది పరిశ్రమలు, ఇతరత్రా అవసరాల నిమిత్తం వేలాది ఎకరాలను ఇచ్చారని, వారి గురించి ఎవరూ చెప్పడంలేదని వాపోయారు.
* వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
* ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమన్నారు. విశాఖలో అన్ని వర్గాల వారికి సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.
* ఏయూ ఆచార్యుడు ఆచార్య షారోన్రాజు మాట్లాడుతూ ఏయూలోని ఉద్యోగులు, ఆచార్యులు, పరిశోధకులు అందరం ఐక్యకార్యాచరణ సమితిగా ఏర్పడి పాలన వికేంద్రీకరణకు మద్దతు పలికామని గుర్తుచేశారు.
* ఆళ్వార్దాస్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్.పి.రవీంద్ర మాట్లాడుతూ విశాఖ నగరం అందర్నీ స్వాగతిస్తుందని తెలిపారు.
* ఏయూ విశ్రాంత ఆచార్యుడు ఆచార్య విజయ్కుమార్ మాట్లాడుతూ విశాఖ పాలన రాజధానికి మద్దతుగా అరసవల్లి నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేయాలని సూచించారు.
* ఉత్తరాంధ్ర ఫోరం ప్రతినిధి శివశంకర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉందన్నారు.
* విద్యుత్తు ఉద్యోగుల సంఘం ప్రతినిధి పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వీకేంద్రీకరణతోనే మూడు ప్రాంతాల అభివృద్ది సాధ్యమన్నారు.
* డాక్టర్ షంషుద్దీన్ మాట్లాడుతూ విశాఖను రెండో ముంబయిగా రాజీవ్గాంధీ అభివర్ణించారని గుర్తు చేశారు.
* ఫార్మారంగ ప్రతినిధి లాల్కృష్ణ మాట్లాడుతూ విశాఖ రాజధాని అయితే ఫార్మారంగం మరింత అభివృద్ధి చెంది మరో నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
* ఏయూ విశ్రాంత ఆచార్యుడు ఆచార్య సూర్యనారాయణ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. విశాఖను రాజధానిగా చేయడానికి మళ్లీ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
* ఈ కార్యక్రమంలో మంత్రి అమర్నాధ్, ఎంపీలు సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, వరుదు కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులో సీఎం... ఎండలో జనం
[ 24-04-2024]
సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
పునరావాసం.. పచ్చి మోసం
[ 24-04-2024]
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
యువతా.. ఓటుకు తరలిరండి..
[ 24-04-2024]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. -
కూపన్లపై పెట్రోలు, డీజిల్ పోయడం కోడ్ ఉల్లంఘనే: జేసీ
[ 24-04-2024]
రాజకీయ పార్టీలు జారీ చేసే కూపన్ల ఆధారంగా పెట్రోలు, డీజిల్ పోస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయా పెట్రోలు బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?
[ 24-04-2024]
జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్ పాలకు ఐదేళ్లయింది. -
కోలాహలంగా విష్ణుకుమార్రాజు నామినేషన్
[ 24-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు నామినేషన్ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగనన్న వస్తే తప్పని తిప్పలు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. -
కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
విశాఖ లోక్సభ స్థానానికి మూడు నామపత్రాలు
[ 24-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. -
సోషల్ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి
[ 24-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. -
మాట తప్పారు.. మడమ తిప్పారు..
[ 24-04-2024]
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.