గుండెలో గుబులు..!
కేజీహెచ్ హృద్రోగ విభాగానికి ఇటీవల వైద్యం కోసం 50 ఏళ్ల మహిళ వచ్చారు. ఆసుపత్రి ఐసీసీయూ విభాగ గేటు వద్ద కుప్పకూలిపోయారు. వైద్యులు సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. తదుపరి రోగ నిర్ధారణ పరీక్షలు చేసి వెంటనే చికిత్స అందించడంతో కోలుకున్నారు.
కొవిడ్ బాధితులూ.. తస్మాత్ జాగ్రత్త
రేపు ప్రపంచ హృదయ దినోత్సవం
విశాఖపట్నం, న్యూస్టుడే
కేజీహెచ్ కార్డియాలజీ ఐసీసీయూ విభాగం
* కేజీహెచ్ హృద్రోగ విభాగానికి ఇటీవల వైద్యం కోసం 50 ఏళ్ల మహిళ వచ్చారు. ఆసుపత్రి ఐసీసీయూ విభాగ గేటు వద్ద కుప్పకూలిపోయారు. వైద్యులు సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. తదుపరి రోగ నిర్ధారణ పరీక్షలు చేసి వెంటనే చికిత్స అందించడంతో కోలుకున్నారు. ఇటువంటి పరిస్థితి కొంత మందికి ఇళ్ల వద్ద, పనిచేసే ప్రదేశంలో ఎదురవుతోంది. వారు తేరుకొని ఆసుపత్రికి వచ్చే లోపే పరిస్థితి విషమిస్తోంది.
* ‘కొవిడ్ బాధితుల్లో గుండె జబ్బులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆకస్మికంగా (సడెన్)గా కుప్పకూలిపోయి ప్రాణాలు పోతున్న కేసులు నమోదవుతున్నాయి. అందుకే గుండె ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ముప్పు పొంచి ఉంద’ని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గురువారం ప్రపంచ హృదయ(గుండె) దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లాలో హృద్రోగాల తీరుపై ‘న్యూస్టుడే’ కథనం..
హఠాత్తుగా కాటేస్తోంది..
* ఇటీవల కాలంలో ‘సడన్ కార్డియాక్ డెత్’ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రత్యేకంగా కారణాలంటూ ఏమీ లేకపోయినా గుండెకు వెళ్లే రక్తనాళల్లో ఏర్పడే తేలిక పాటి గడ్డలు అంతర్భాగంలో ఒక్కసారి పగిలిపోయి గుండెకు రక్త సరఫరా నిలిచిపోయి తీవ్రమైన నొప్పితో కుప్ప కూలిపోతున్నారు. వెంటనే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కొంత వరకు ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ‘సడన్ కార్డియాక్ డెత్’లు 45 ఏళ్ల నుంచి 70ఏళ్ల మధ్య వయస్కుల్లో కనిపిస్తాయని, ఇప్పుడు 30ఏళ్ల యువకులు ఈ వ్యాధి బారిన పడుతున్నారని వెల్లడిస్తున్నారు.
కేజీహెచ్లో సౌకర్యాలు
* కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో అన్ని రకాల ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. వారంలో ఏడు రోజులూ ఓపీ నిర్వహిస్తున్నారు. ఏ సమయంలోనైనా హృద్రోగులు నేరుగా ఐసీసీయూకు వచ్చి చికిత్స పొందవచ్చు. ఈసీజీ, 2డి ఎకో, డిఫ్రిలేటరు, సీపీఆర్ వసతులతో పాటు క్యాథ్లాబ్ అందుబాటులో ఉన్నాయి.
* నెలకు 200 వరకు ఏంజియోగ్రామ్లు, మరో 40 నుంచి 50 వరకు స్టంట్లు వేస్తున్నారు. బైపాస్ సర్జరీలు సైతం చేస్తున్నారు. ఓపీ, ఐపీ విభాగాలకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోంది.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
* ఛాతిలో మంటగా ఉన్నా, గుండె పట్టేసినట్లు అనిపించినా, అధికంగా చెమటలు పట్టినా వెంటనే అప్రమత్తం కావాలి. ఈ తరహా లక్షణాలు గ్యాస్ట్రిక్ సమస్యలోనూ కనిపిస్తాయి. గుండె నొప్పిని గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి అజాగ్రత్తగా ఉంటే మూల్యం చెల్లించుకోకతప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 40ఏళ్లు దాటిన వారందరూ ఆరు నెలలకోసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. గుండె జబ్బులతో ఆసుపత్రులకు వచ్చే మొత్తం కేసుల్లో 10 శాతం యువత ఉంటున్నారు. వీరిలో కొవిడ్ బాధితులు ఎక్కువ ఉన్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
గుండెలో ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. హృద్రోగ సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే చక్కని జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. యోగా సాధన చేస్తూ మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా సమయానికి భోజనం చేయాలి. పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. ఆయిల్తో కూడిన ఆహారం తగ్గించాలి. రాత్రిళ్లు ఎక్కువ సమయం మేలుకోకూడదు.
ఇవీ కారణాలు..
* గుండె జబ్బులపై అవగాహన లేమి
* తీవ్రమైన ఒత్తిళ్లు
* శారీరక వ్యాయామం లేకపోవడం
* ఊబకాయం
* పొగ, మద్యం తాగడం
* అధిక రక్తపోటు, మధుమేహం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులో సీఎం... ఎండలో జనం
[ 24-04-2024]
సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
పునరావాసం.. పచ్చి మోసం
[ 24-04-2024]
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
యువతా.. ఓటుకు తరలిరండి..
[ 24-04-2024]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. -
కూపన్లపై పెట్రోలు, డీజిల్ పోయడం కోడ్ ఉల్లంఘనే: జేసీ
[ 24-04-2024]
రాజకీయ పార్టీలు జారీ చేసే కూపన్ల ఆధారంగా పెట్రోలు, డీజిల్ పోస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయా పెట్రోలు బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?
[ 24-04-2024]
జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్ పాలకు ఐదేళ్లయింది. -
కోలాహలంగా విష్ణుకుమార్రాజు నామినేషన్
[ 24-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు నామినేషన్ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగనన్న వస్తే తప్పని తిప్పలు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. -
కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
విశాఖ లోక్సభ స్థానానికి మూడు నామపత్రాలు
[ 24-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. -
సోషల్ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి
[ 24-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. -
మాట తప్పారు.. మడమ తిప్పారు..
[ 24-04-2024]
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి