ఏదొకటి చెప్పెయ్... కాలం గడిపెయ్
విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) చుట్టూ కాళ్లరిగేలా ప్రజలు తిరుగుతున్నా పనులు కావడం లేదు.కలెక్టరు మల్లికార్జున ఇన్ఛార్జి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రతి సోమవారం ‘స్పందన’ నిర్వహించి వినతులు స్వీకరిస్తున్నారు.
ఇదీ ‘వీఎంఆర్డీఏ’ ఉద్యోగుల తీరు
కార్యాలయం చుట్టూ ప్రజల ప్రదక్షిణలు
- ఈనాడు, విశాఖపట్నం
విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) చుట్టూ కాళ్లరిగేలా ప్రజలు తిరుగుతున్నా పనులు కావడం లేదు.కలెక్టరు మల్లికార్జున ఇన్ఛార్జి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రతి సోమవారం ‘స్పందన’ నిర్వహించి వినతులు స్వీకరిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు వాటిపై స్పందించడం లేదనే విమర్శలొస్తున్నాయి. ప్రజలు కార్యాలయాలకు వస్తున్నా కొందరు ఉద్యోగులు ఏదొక కారణం చెబుతూ వాయిదా వేస్తున్నారు. కొందరు హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కొన్నేళ్లుగా వారి సమస్యలు పెండింగులో ఉన్నా పట్టించుకోవడంలేదు. ఎక్కువగా పరిపాలన, ఎస్టేట్, ప్లానింగ్ విభాగాల్లో ఈ రకమైన ఇబ్బందులు వస్తున్నాయి.
రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో..
వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సెక్రటరీ ఆధ్వర్యంలో పరిపాలన విభాగం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాలి. గత కొంతకాలంగా ఈ ప్రక్రియ చేయడం లేదు. డబ్బులు పూర్తిస్థాయిలో చెల్లించినా రిజిస్ట్రేషన్కు పలుమార్లు తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీఎంఆర్డీఏకు పూర్తిస్థాయి సెక్రటరీ లేరు. సంయుక్త కమిషనర్కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. కొనుగోలుదారులు 8వ అంతస్తులోని పరిపాలన విభాగాన్ని సంప్రదిస్తుంటే కొద్ది రోజులు తరువాత రావాలని సమాధానం ఇస్తున్నారు. ప్లాట్ల క్రయవిక్రయాలకు వీఎంఆర్డీఏ నుంచి రావాల్సిన నిరభ్యంతర పత్రం ఇవ్వడంలోనూ జాప్యం జరుగుతుందనే విమర్శలు వచ్చాయి.
దస్త్రాలు చూస్తున్నాం...
ఎస్టేట్ విభాగంలో ఏ దస్త్రం ఎక్కడుందో తెలియని పరిస్థితి. అవసరమైన పత్రాల కోసం ప్రజలు ఏళ్లుగా తిరుగుతున్నా కొందరు ఉద్యోగుల నుంచే వచ్చే సమాధానం ఒకటే...‘బీరువాల్లో దస్త్రాలు వెతుకుతున్నాం’ అని. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన వాటికి కూడా ప్లానింగ్, ఇతర విభాగాల్లో కనీసం సమాధానాలు లేకపోవడం గమనార్హం. దీంతో విసిగెత్తిన దరఖాస్తుదారులు సమాచార కమిషనర్ను సంప్రదిస్తున్నారు. పాత లేఅవుట్ కాపీలు, భూములకు సంబంధించిన వివరాలు, ఒప్పంద పత్రాలు వంటివి కోరినా నెలల సమయం పడుతోంది.
వివరాలు తెలియజేస్తే..
ప్రతి సోమవారం స్పందన నిర్వహిస్తున్నాం. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వాటిని మా దృష్టికి తీసుకురావొచ్ఛు పరిష్కరించేలా చూస్తాం. రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నాం. ఎవరికైనా చేయకపోతే ఆ వివరాలు చెప్పొచ్ఛు తగు ఆదేశాలు ఇస్తాం’ అని వీఎంఆర్డీఏ ఛైర్పర్సన్ విజయనిర్మల పేర్కొన్నారు.
డబ్బులు చెల్లించినా..
‘వుడా కాలనీలో ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నాం. మా అమ్మ నుంచి మాకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కొంతకాలంగా తిరుగుతున్నాం. కొంత మొత్తం చెల్లించాలని చెబితే అదీ 2020లోనే చెల్లించేశాం. ఇటీవల రెండు సార్లు వచ్చాం. మళ్లీ రావాలని సమాధానం ఇచ్చారు. గత నెలలో దస్త్రంతో అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాం. తాజాగా ఈ నెల 12 వీఎంఆర్డీఏ 8వ అంతస్తులో సంప్రదిస్తే కొద్ది రోజులు తరువాత రమ్మని చెప్పారు. పనులు మానుకొని ప్రత్యేకంగా రావాల్సి వస్తోంది’ అని విజయనగరం జిల్లా వాసి ఒకరు వాపోయారు.
నమ్మకంగా కొంటే..
‘ఎండాడలో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్లను నమ్మకంతో కొనుగోలు చేశాం. కొందరు డబ్బులు మొత్తం చెల్లించేశారు. మరికొందరు సగం వాయిదాలు చెల్లించారు. పూర్తిగా డబ్బులు చెల్లించిన వారికి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. మరో వైపు అక్కడి స్థలం కొంత వివాదంలో ఉందంటున్నారు. పదేళ్లు గడిచినా ఆ సమస్యకు పరిష్కారం చూపలేదు. కమిషనర్ మారినపుడల్లా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు’ అని ఎండాడ లేఅవుట్ సంఘ సభ్యులు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.