logo

‘అమర్‌కు పాలన చేతకాకే తెదేపాపై విమర్శలు’

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు రాజకీయ బిక్ష పెట్టింది తెదేపాయే అని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ పేరుమార్చడాన్ని నిరసిస్తూ కశింకోటలో గురువారం రిలే నిరాహార దీక్షలు చేశారు. శిబిరాన్ని

Updated : 30 Sep 2022 05:58 IST

శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పీలా

కశింకోట, న్యూస్‌టుడే: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు రాజకీయ బిక్ష పెట్టింది తెదేపాయే అని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ పేరుమార్చడాన్ని నిరసిస్తూ కశింకోటలో గురువారం రిలే నిరాహార దీక్షలు చేశారు. శిబిరాన్ని పీలా గోవింద సందర్శించారు. తొలుత జాతీయ రహదారి పక్కన ఉన్న ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక్క వైద్య కళాశాలా నిర్మించలేని ప్రభుత్వానికి ఎన్టీఆర్‌ పేరును తొలగించే హక్కు లేదన్నారు. నిర్మించడం చేతకానివాడికి తొలగించే హక్కు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. మంత్రి అమర్‌కు తెదేపాపై విమర్శలు చేయడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు ఉగ్గిన రమణమూర్తి, కాయల మురళీధర్‌, పెంటకోట రాము, సిదిరెడ్డి శ్రీనివాసరావు, వేగి వెంకటరావు, తాకాశి కృష్ణ, కలగా సోమేశ్వరరావు, బుదిరెడ్డి గంగయ్య, జెర్రిపోతుల నూకినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని