logo

హుండీల దొంగ అరెస్టు

నర్సీపట్నంలో వరుసగా జరుగుతున్న హుండీల చోరీ కేసుల్లో నిందితుడ్ని పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ గణేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రావికమతం మండలం మర్రివలసకు చెందిన అమ్మిరెడ్డి వరహాలు

Published : 30 Sep 2022 03:57 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: నర్సీపట్నంలో వరుసగా జరుగుతున్న హుండీల చోరీ కేసుల్లో నిందితుడ్ని పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ గణేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రావికమతం మండలం మర్రివలసకు చెందిన అమ్మిరెడ్డి వరహాలు (25)ను అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారించామన్నారు.  శారదానగర్‌లోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అబీద్‌ కూడలిలోని వీరబ్రహ్మేందస్వామి ఆలయాల్లో హుండీలను ఎత్తుకుపోయినట్లు అంగీకరించాడని చెప్పారు. రూ.2645 నగదు, హుండీని స్వాధీనం చేసుకున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని