logo

తెదేపా నేతలు ఏంచేశారో చెప్పాలి : బొత్స

అచ్చెన్నాయుడు మహా జ్ఞాని.. మేము అజ్ఞానులమా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం గవర్నర్‌ బంగ్లాలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విశాఖకు తెదేపా నేతలు ఏంచేశారో

Published : 30 Sep 2022 03:57 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: అచ్చెన్నాయుడు మహా జ్ఞాని.. మేము అజ్ఞానులమా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం గవర్నర్‌ బంగ్లాలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విశాఖకు తెదేపా నేతలు ఏంచేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజశేఖర్‌రెడ్డి పాలనలో విశాఖ, రాష్ట్రం అభివృద్ధి జరిగిందని, విమ్స్‌, హెల్త్‌సిటీ, ఫార్మాసిటీ, ఐటీసెజ్‌, గంగవరం పోర్టు వంటివి వచ్చాయన్నారు. హుద్‌హుద్‌ తుపాన్‌లో తప్పుడు లెక్కలు చూపి దోచుకుతిన్నారని ఆరోపించారు. పరిహారం అడిగితే రికార్డులు పోయాయని బుకాయించారన్నారు. విశాఖలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకొని దోచుకున్నారని దుయ్యబట్టారు. అశోక్‌గజపతిరాజు విజయనగరం కోసం ఏంచేశారని ప్రశ్నించారు. యూనివర్సిటీ, మెడికల్‌ కళాశాల, నీటిపారుదల ప్రాజెక్టులు తాము తెచ్చామని, ఏం మొహం పెట్టుకొని అశోక్‌గజపతిరాజు హేళన చేస్తారన్నారు. విశాఖకు రాజధాని ఎందుకు రాకూడదో తెదేపా నేతలు చెప్పాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని