logo

ఫుట్‌బాల్‌ పోటీల విజేత ఏఎంసీ జట్టు

డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అంతర్‌ కళాశాలల ఫుట్‌బాల్‌ పోటీలు శుక్రవారం ఆంధ్ర వైద్య కళాశాల మైదానంలో ముగిశాయి. టోర్నీలో ఆంధ్ర వైద్య కళాశాల (ఏఎంసీ) జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానంలో రాజమహేంద్రవరానికి చెందిన జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల జట్టు నిలిచింది.

Published : 01 Oct 2022 03:47 IST

ఏఎంసీ జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న వీసీ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తదితరులు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అంతర్‌ కళాశాలల ఫుట్‌బాల్‌ పోటీలు శుక్రవారం ఆంధ్ర వైద్య కళాశాల మైదానంలో ముగిశాయి. టోర్నీలో ఆంధ్ర వైద్య కళాశాల (ఏఎంసీ) జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానంలో రాజమహేంద్రవరానికి చెందిన జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల జట్టు నిలిచింది. ఫైనల్స్‌లో ఏఎంసీ జట్టు 3-2 గోల్స్‌తో జీఎస్‌ఎల్‌ జట్టుపై గెలుపొందింది. హెల్త్‌వర్సిటీ వీసీ డాక్టర్‌ పి.శ్యామ్‌ప్రసాద్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ట్రోఫీలు, పతకాలు అందజేశారు. పద్మశ్రీ  డాక్టర్‌ ఎస్‌.ఆదినారాయణ, ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు, క్రీడా విభాగ ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఆర్‌.సునీల్‌కుమార్‌, ఫిజికల్‌ డైరెక్టరు డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎన్‌.పాత్రుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని