హే.. మహాత్మా.. ఇదేం గ్రామ స్వరాజ్యం!
ఉమ్మడి జిల్లాలో 969 పంచాయతీలున్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించక ముందు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.120 కోట్లు విద్యుత్తు ఛార్జీల పేరుతో మళ్లించారు. సర్పంచులుగా ఎన్నికయిన తర్వాత విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులను కూడా తమ అనుమతి లేకుండా వెనక్కి తీసుకున్నారు.
నిధులు, విధులు కోసం సర్పంచుల భిక్షాటన
జీతాల కోసం పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనలు
ఈనాడు డిజిటల్, పాడేరు
జీతాలు బకాయిలు చెల్లించాలంటూ అనకాపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న పంచాయతీ కార్మికులు, క్లాప్ మిత్రాలు (పాతచిత్రం)
స్వాతంత్య్రం కంటే పారిశుద్ధ్యం ముఖ్యం. జీవన విధానంలో పరిశుభ్రత, పారిశుద్ధాన్ని అంతర్భాంగా చేసుకోవాలి
- మహాత్మాగాంధీ
ఉమ్మడి జిల్లాలో 969 పంచాయతీలున్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించక ముందు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.120 కోట్లు విద్యుత్తు ఛార్జీల పేరుతో మళ్లించారు. సర్పంచులుగా ఎన్నికయిన తర్వాత విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులను కూడా తమ అనుమతి లేకుండా వెనక్కి తీసుకున్నారు. సాధారణ నిధులను సైతం ఖర్చుచేయకుండా ఆంక్షలు విధిస్తున్నారు. పంచాయతీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. దీంతో సర్పంచులు పూర్తిగా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది.
‘పాలనలో సంస్కరణలు తీసుకొచ్చాం.. మహాత్ముడు కలలుగన్న సమాజాన్ని సాకారం చేశాం’ అని సర్కారు పెద్దలు ఘనంగా చెప్పుకొంటున్నారు. క్షేత్రస్థాయిలో ఆ మహనీయుడి ఆకాంక్షలకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల అధికారాల్లో కోతపెట్టడంతో.. సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. నిధులు దారి మళ్లించడంతో పల్లెల్లో కనీస అవసరాలను తీర్చలేకపోతున్నారు. మరోవైపు పల్లెల స్వచ్ఛతలో కీలకమైన పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు నిలిచిపోయాయి. దీంతో స్వచ్ఛ సంకల్పానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. నేడు జాతిపిత మహత్మా గాంధీ జయంతి సందర్భంగా సర్కారు చెబుతున్న గ్రామస్వరాజ్యం అమలు తీరుపై కథనం.
జీతాలే ఇవ్వకుంటే పారిశుద్ధ్యమెలా..!
స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర సాధన కోసమంటూ రూ.కోట్లు కుమ్మరిస్తున్నా అవన్నీ ఆరంభ శూరత్వంగానే మిగలిపోతున్నాయి. పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడటం, నిధుల లేమి వెరసి స్వచ్ఛ సంకల్పానికి తూట్లు పొడుస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని సర్కారు గాలికి వదిలేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 2,960 మంది క్లాప్ మిత్రలు, సంపద కేంద్రాల వద్ద మరో 679 మంది గ్రీన్ గార్డులు పనిచేస్తున్నారు. వీరందరికీ నెలకు రూ.6 వేలు చొప్పున వేతనాలు ఇవ్వాలి. ఈ ఏడాది మార్చి తర్వాత జీతాలు నిలిచిపోయాయి.
నిధుల మళ్లింపునకు నిరసనగా చింతపల్లిలో ఇటీవల భిక్షాటన చేసిన సర్పంచులు
సర్పంచులే భిక్షాటన చేస్తే స్వరాజ్యమంటామా..
మహాత్ముడు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం సాధించాలంటే సర్పంచులకు పూర్తి అధికారాలుండాలి. పల్లెలకు కేటాయించిన నిధులను వారే ఖర్చుచేయాలి. ఇదిలా ఉంటే కేంద్రం ఇచ్చే నిధులను సర్పంచుల సమ్మతితో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం మళ్లించేసుకుంటోంది. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులే కాదు వీధి దీపాలు మార్చడానికి కూడా నిధుల్లేక విలవిల్లాడాల్సి వస్తోంది. ఇప్పటికే పల్లె ఖాతాలు ఖాళీ అయిపోయాయి. త్వరలో విడుదల చేయబోయే 15వ ఆర్థిక సంఘం నిధులను పీఎఫ్ఎంఎస్ ఖాతాల్లో కాకుండా పీడీ ఖాతాల్లోనే జమచేయాలని సర్కారు చూస్తోంది. దీంతో పల్లె పాలకులంతా ఆందోళన బాటపట్టారు. కొందరు సర్పంచులైతే కాలువలు ఊడ్చి, భిక్షాటన చేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కులు, విధులు హరిస్తే గ్రామ స్వరాజ్యం ఎలా సిద్ధిస్తుందని సొంత పార్టీకి చెందిన సర్పంచులే ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?