మార్చాల్సినవి లక్షపైనే..!
ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 3.32 లక్షల మందికి జగనన్న విద్యాకానుక కిట్లు ఇచ్చారు. గతంలో ఒకేసారి ఏడు రకాల సామగ్రిని విద్యార్థుల చేతిలో పెట్టారు.
బ్యాగులు, బూట్లు వెనక్కి.. విద్యాకానుకలో లోపాల దిద్దుబాటు
ఈనాడు డిజిటల్, పాడేరు
ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 3.32 లక్షల మందికి జగనన్న విద్యాకానుక కిట్లు ఇచ్చారు. గతంలో ఒకేసారి ఏడు రకాల సామగ్రిని విద్యార్థుల చేతిలో పెట్టారు.
జగనన్న విద్యాకానుక కిట్లో స్కూల్ బ్యాగులు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. బూట్లు కూడా సరైన కొలతలు సరఫరా చేయలేదు. విద్యార్థులు వాటిని వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ జేవీకే కిట్ల నాణ్యతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులందడంతో సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
స్కూల్ బ్యాగులు మార్చడానికి జేవీకే యాప్లో నమోదుకు అవకాశం కల్పించింది. అలాగే బూట్ల మార్పిడికి షూ మేళాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 5 వేలకు పైగా బ్యాగుల మార్పిడికి సంబంధించి ఉపాధ్యాయులు యాప్లో నమోదు చేశారు. బూట్లు కోసం మేళా చేపట్టారు. దసరా సెలవుల తర్వాత వీటి మార్పిడికి లక్షల్లో అభ్యర్థనలు వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది కానుక మొత్తం ఒకేసారి కాకుండా పుస్తకాలు, బ్యాగులు ఒకసారి, బెల్టులు, బూట్లు ఒకసారి, ఏకరూప దుస్తులు, డిక్షనరీలు విడతల వారీగా అందజేశారు. అందులో మొదటిగా ఇచ్చిన స్కూల్ బ్యాగులే నాసిరకంగా ఉన్నాయి. భుజానికి వేసుకున్న రోజునే బ్యాగులు చిరిగిపోయాయి..జిప్లు ఊడిపోయాయి.. తాళ్లు తెగిపోయాయి.. అప్పట్లోనే వీటి నాణ్యత లోపాని ఎత్తిచూపించినా గుత్తేదారు పట్టించుకోలేదు. అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వమే వీటి నాణ్యతను పరిశీలించి బాగోలేవని నిర్ధారణకు వచ్చింది. వాటి స్థానంలో కొత్త బ్యాగులు సరఫరా చేయడానికి ఆదేశించింది. ఈ మేరకు జేవీకే యాప్లో మార్పులు చేసి నాసిరకం బ్యాగులను వెనక్కి పంపించేలా ఏర్పాట్లు చేశారు.
90 శాతం నాసిరకమే..
విద్యార్థులకు ఇచ్చిన స్కూల్ బ్యాగుల్లో సుమారు లక్ష బ్యాగులు పైనే మార్చాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జూన్లో మొదటి విడతగా మూడు సైజుల్లో 1.2 లక్షలు బ్యాగులు జిల్లాకు వచ్చాయి. వీటిలో 90 శాతం నాసిరకంగానే ఉన్నాయి. చిరిగిన బ్యాగులనే భుజన వేసుకుని వస్తున్నవారు కొందరైతే.. సొంతంగా బ్యాగులు కొని తెచ్చుకుంటున్నవారు మరికొంతమంది. పాడైన వాటిని మార్చాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతూనే ఉన్నారు. సెలవులకు కొద్ది రోజుల ముందే వీటి మార్పిడికి ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో కొందరి వివరాలే నమోదు చేయగలిగారు.. సెలవుల తర్వాత భారీగానే మార్చడానికి అవకాశం ఉంది. బూట్ల విషయంలో విద్యార్థుల పాదాల కొలతలకు సరిపడా సరఫరా చేయలేదు. నచ్చిన కొలతలు పంపించేశారు. వాటిలో సరిపోయిన వాటిని విద్యార్థులకు ఇచ్చి మిగతా బూట్లను పాఠశాల నుంచి మండల స్థాయి వరకు మేళా నిర్వహించి మార్పులు చేశారు. ఇంకా అవసరమైన వాటి కోసం ఇతర జిల్లాలో మిగిలిన బూట్లను తెప్పించే ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో 35 వేల వరకు స్కూల్ బ్యాగులు మిగులు నిల్వ ఉంచామని నాణ్యత లేని వాటి స్థానంలో మార్పు చేస్తున్నామని ఎస్ఎస్ఏ ఏపీసీ శ్రీనివాసరావు చెప్పారు. యాప్లో నమోదు చేసిన తర్వాత మిగతా బ్యాగులు మార్చుతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..