logo

జాతీయ స్థాయి పోటీలకు స్వాతి

పెదనందిపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన వంటాకు స్వాతి జాతీయస్థాయి సెపక్‌ తక్రా పోటీకి ఎంపికైంది. చిననందిపల్లిలో రైతు కుటుంబానికి చెందిన ఈ బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ నెల 3 నుంచి కర్ణాటక రాష్ట్రంలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది.

Published : 03 Oct 2022 03:32 IST

దేవరాపల్లి, న్యూస్‌టుడే: పెదనందిపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన వంటాకు స్వాతి జాతీయస్థాయి సెపక్‌ తక్రా పోటీకి ఎంపికైంది. చిననందిపల్లిలో రైతు కుటుంబానికి చెందిన ఈ బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ నెల 3 నుంచి కర్ణాటక రాష్ట్రంలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది. గతనెల 22 నుంచి ఈ నెల 1 వరకు అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఈ సందర్భంగా స్వాతి, కోచ్‌ విజయ్‌ కుమార్‌ని హెచ్‌ఎం పి.శ్రీనివాసరావు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని