ఫలించిన స్వచ్ఛ ప్రయత్నం!
స్వచ్ఛతలో విశాఖ నగరం జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ర్యాంకుల్లో నాలుగో ర్యాంకు సాధించి, దేశంలోని అత్యున్నత నగరాల సరసన చేరింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నగరానికి పంపిన బృందం పారిశుద్ధ్య నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో 10 లక్షల కంటే అధిక జనాభా కలిగిన నగరాలలో జీవీఎంసీకి మొదటి స్థానాన్ని ఇస్తూ అవార్డు ప్రకటించింది.
సమష్టి కృషితో 4వ ర్యాంకు సాధన
కార్పొరేషన్, న్యూస్టుడే
స్వచ్ఛతలో విశాఖ నగరం జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ర్యాంకుల్లో నాలుగో ర్యాంకు సాధించి, దేశంలోని అత్యున్నత నగరాల సరసన చేరింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నగరానికి పంపిన బృందం పారిశుద్ధ్య నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో 10 లక్షల కంటే అధిక జనాభా కలిగిన నగరాలలో జీవీఎంసీకి మొదటి స్థానాన్ని ఇస్తూ అవార్డు ప్రకటించింది.
* స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో కేంద్రం పేర్కొన్న మార్గదర్శకాలన్నీ మహానగరపాలక సంస్థ పాటించింది. చెత్త రహిత నగర(గార్బేజ్ ఫ్రీ సిటీ) విభాగంలో మంచి మార్కులు వచ్చాయి. 608 వాహనాలతో ఇళ్ల నుంచి చెత్త సేకరించడం, ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనల మేరకు క్లోజ్డ్ కాంపాక్షన్ వాహనాలతో చెత్తను తరలించడం మంచి ఫలితమిచ్చింది.
* ఇటీవల కాపులుప్పాడ డంపింగ్యార్డులో జీవీఎంసీ చెత్త నుంచి విద్యుత్తు తయారు చేసే కర్మాగారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్లింగ్ పనులు, బయోగ్యాస్ ఉత్పత్తి వంటి అంశాలు కూడా ఉత్తమ ర్యాంకు రావడానికి దోహద పడ్డాయి. ఓడీఎఫ్ విభాగంలో జీవీఎంసీ మంచి పనితీరు కనబరిచింది.
* నగర శివారు పెందుర్తి, గాజువాక, మల్కాపురం ప్రాంతాలలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణ పనులు, టెర్షరీ ట్రీట్ మెంట్ (మూడో దశ శుద్ధి) ప్రాజెక్టుతోపాటు, నగరంలో ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి) కేంద్రాలను పునరుద్ధరించే పనులు ర్యాంకు సాధనకు ఉపకరించాయి. నగరంలో ప్లాస్టిక్ను నిషేధించడం, ఎక్కడికక్కడ ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను నియంత్రించడంపై దృష్టి పెట్టారు. గతేడాది ఏయే అంశాల్లో వెనుకబడ్డారో విశ్లేషించుకుని.. ఆయా లోపాలను అధిగమించడానికి నిరంతరం కృషి చేయడం కలిసొచ్చిందని చెబుతున్నారు.
వచ్చే ఏడాది మెరుగైన ర్యాంకు సాధిస్తాం..
రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఉత్తమ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉంది. జీవీఎంసీ గతంలో కంటే మెరుగైన ర్యాంకు సాధించడం వెనుక అధికారులు, కార్మికుల విశేష కృషి ఉంది. గత కమిషనర్ లక్ష్మీశ తీసుకున్న చర్యలు ఎంతగానో ఉపకరించాయి. వచ్చే ఏడాది మరింత మెరుగైన ర్యాంకు సాధించడానికి కృషి చేస్తాం.
- పి.రాజాబాబు, జీవీఎంసీ కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.