logo

భీమ జ్యూయలరీ షోరూం ప్రారంభం

ఆశీలుమెట్టలో నూతనంగా ఏర్పాటైన భీమ జ్యూయలరీ షోరూంను సినీ నటి నిక్కీ గల్రాని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీగా చేరుకున్న అభిమానులకు ఆమె అభివాదం చేశారు.

Updated : 03 Oct 2022 13:41 IST


భీమ షోరూంను ప్రారంభిస్తున్న సినీనటి నిక్కీ గల్రాని

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఆశీలుమెట్టలో నూతనంగా ఏర్పాటైన భీమ జ్యూయలరీ షోరూంను సినీ నటి నిక్కీ గల్రాని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీగా చేరుకున్న అభిమానులకు ఆమె అభివాదం చేశారు. అనంతరం మాట్లాడుతూ అత్యాధునిక డిజైన్లలో రూపొందించిన బంగారు ఆభరణాలను భీమ సంస్థ వినియోగదారులకు అందుబాటులో ఉంచిందన్నారు. అనంతరం షోరూంలో కలియ తిరిగి ఆభరణాలను పరిశీలించారు. సంస్థ ఛైర్మన్‌ బి.గోవిందన్‌ మాట్లాడుతూ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబరు 31వ తేదీ వరకు బంగారం వీఏపై 50శాతం తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. వజ్రాలు ఒక క్యారటపై రూ.15వేల తగ్గింపు ఉంటుందని, వెండి వస్తువులపై వీఏ శాతం ఉండదని పేర్కొన్నారు. వివాహ ఖాతాదారుల కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. అదే విధంగా లక్కీ డ్రా బహుమతులు అందిస్తున్నామన్నారు. మేనేజింగ్‌ పార్టనర్‌ జయగోవిందన్‌, డైరెక్టర్లు, మేనేజింగ్‌ డైరెక్టర్లు గాయత్రి సుహాస్‌, సుహాస్‌ ఎంఎస్‌, దీపాకపూర్‌, సుధీర్‌కపూర్‌, ఆరతి గురురాజ్‌, గురురాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని