బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
జాతీయ రహదారి విశాఖ డెయిరీ కూడలి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. గాజువాక పోలీసుల వివరాల ప్రకారం విజయనగరం జిల్లా వేపాడ మండలం వెలుపర్తి గ్రామానికి చెందిన కల్లకురస సతీశ్కుమార్(26) స్కూటీపై గాజువాక నుంచి ఎన్ఏడీకూడలి వైపు వెళ్తున్నాడు.
సతీశ్కుమార్ (పాతచిత్రం)
అక్కిరెడ్డిపాలెం, న్యూస్టుడే : జాతీయ రహదారి విశాఖ డెయిరీ కూడలి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. గాజువాక పోలీసుల వివరాల ప్రకారం విజయనగరం జిల్లా వేపాడ మండలం వెలుపర్తి గ్రామానికి చెందిన కల్లకురస సతీశ్కుమార్(26) స్కూటీపై గాజువాక నుంచి ఎన్ఏడీకూడలి వైపు వెళ్తున్నాడు. అదే మార్గంలో రాజమహేంద్రవరం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనక నుంచి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన సతీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి కేసు నమోదు చేశారు. సతీశ్కుమార్ గాజువాకలో బంధువుల ఇంటి నుంచి తెల్లవారు జాము మూడు గంటల సమయంలో తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
ఆసుపత్రి భవనంపై నుంచి పడి మరొకరు..
సంతోష్కుమార్ (పాతచిత్రం)
గోపాలపట్నం: చికిత్స పొందుతున్న యువకుడు ఆసుపత్రి భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటన ఆదివారం గోపాలపట్నంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలేనికి చెందిన దాడి సంతోష్కుమార్ (30) అనారోగ్య సమస్యలతో ఇటీవలే గోపాలపట్నం ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. భవనం రెండో అంతస్తు గదిలో చికిత్స పొందుతున్న సంతోష్కుమార్ వద్ద సహాయకురాలిగా అతని తల్లి ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున వైద్యసిబ్బంది గది తలుపులు తీయగా, మంచంపై సంతోష్ కనిపించలేదు. వెంటనే పరిసరాల్లో పరిశీలించగా అతడు భవనం పక్కన పడి తలకు తీవ్రగాయమై మృతి చెంది ఉన్నాడు. ఆసుపత్రి యాజమాన్యం సమాచారంతో పోలీసులు ఘటానాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా..? ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడా..? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ సతీష్కుమార్ ఆధ్వర్యంలో ఏఎస్సై అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
[ 28-03-2024]
నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. -
ఆ వర్గాలకుసీట్లేవి?
[ 28-03-2024]
ఉమ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు. -
ప్రలోభాలపై నిఘా... ఉల్లంఘనలపై కఠిన చర్యలు
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
ఉత్తరం నుంచి మూడోసారి..
[ 28-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి త్రిముఖ వ్యూహంతో అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. -
ఘనంగా రామ్చరణ్ జన్మదిన వేడుకలు
[ 28-03-2024]
అనకాపల్లి పట్టణంలో సినీహీరో రామ్చరణ్ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. -
రాష్ట్రాభివృద్ధికే కూటమి పొత్తులు
[ 28-03-2024]
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైకాపాను ఓడించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. -
జనసేనలోకి వైకాపా నేత మన్యాల శ్రీనివాస్
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
విమ్స్లో రోగి సహాయకులపైనే భారం
[ 28-03-2024]
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో నాలుగో తరగతి సిబ్బంది పనితీరుపై రోజురోజుకీ విమర్శలు అధిక మవుతున్నాయి. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. -
సంపులో పడి సెక్యూరిటీ గార్డు మృతి
[ 28-03-2024]
విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటనపై బుధవారం దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. -
డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్టు
[ 28-03-2024]
డీజిల్ స్మగ్లింగ్ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్