logo

ఉక్కులో..‘ఆరోగ్య పరుగు’

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉక్కునగరంలో ఉక్కు క్రీడా విభాగం ఆధ్వర్యంలో ‘ఫిట్‌ ఇండియా-ఫ్రీడమ్‌ రన్‌’ పేరిట ఆరోగ్య పరుగు నిర్వహించారు.

Updated : 04 Oct 2022 05:55 IST


పరుగును ప్రారంభిస్తున్న ఉక్కు అధికారులు

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే : ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉక్కునగరంలో ఉక్కు క్రీడా విభాగం ఆధ్వర్యంలో ‘ఫిట్‌ ఇండియా-ఫ్రీడమ్‌ రన్‌’ పేరిట ఆరోగ్య పరుగు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉక్కు సీజీఎంలు (మెడికల్‌) కె.హెచ్‌ ప్రకాష్‌, ఎఫ్‌.కె.లక్రా ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నిత్యం పోషకాహారంతో పాటు వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉక్కు ఉద్యోగులు, వారి కుటుంబీకులు పరుగులో పాల్గొన్నారు. అధికారులు ఎం.ఎస్‌.కుమార్‌, ప్రసాద్‌, శ్రీధర్‌, రామస్వామి తదితరులు హాజరయ్యారు. మరో కార్యక్రమంలో కర్మాగార డీఎన్‌డబ్ల్యూ, ట్రాఫిక్‌ విభాగాల్లో అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛభారత్‌ నిర్వహించి.. పరిసరాలను శుభ్రం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని