logo

మూడు రాజధానులకు మద్దతుగా పూజలు

మూడు రాజధానులకు మద్దతుగా పెదవాల్తేరు పోలమాంబ ఆలయంలో మంగళవారం ఉదయం నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తదితరులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.

Updated : 05 Oct 2022 06:53 IST

కొబ్బరికొయలు కొడుతున్న వైకాపా నేతలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: మూడు రాజధానులకు మద్దతుగా పెదవాల్తేరు పోలమాంబ ఆలయంలో మంగళవారం ఉదయం నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తదితరులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. తెలుగుదేశం నాయకులు, అమరావతి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల మనసు మార్చాలని దుర్గాదేవిని పూజించారు. కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, కార్పొరేటర్‌ గేదెల లావణ్య, 28 వార్డు పరిశీలకులు పల్లా దుర్గారావు, రవిరెడ్డి, నడిపెల్లి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని