logo

మొన్న భర్త.. నిన్న భార్య..

కేంద్ర కారాగారం వద్ద బీఆర్‌టీఎస్‌ రహదారిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే.

Published : 05 Oct 2022 04:44 IST

వరలక్ష్మి (దాచిన చిత్రం)

ధారపాలెం, (విశాలాక్షినగర్‌) న్యూస్‌టుడే: కేంద్ర కారాగారం వద్ద బీఆర్‌టీఎస్‌ రహదారిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో గాయాలపాలైన వారు చికిత్స పొందుతుండగా వీరిలో వరలక్ష్మి(62) మంగళవారం మృతిచెందింది. ఈమె సోమవారం సంఘటన స్థలంలోనే మృతిచెందిన ప్రతాపరావు వెంకటగిరి సతీమణి. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వరలక్ష్మి వెంకోజీపాలెం మెడికవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని