logo

ఉద్యోగిని ఢీకొన్న బస్సు

వారం రోజుల తేడాలో జరిగిన రెండు బ్రాండిక్స్‌ దుస్తుల కంపెనీ బస్సుల ప్రమాదాలను మర్చిపోకుండానే హరిపాలెంలో మరో ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న గ్రామానికి చెందిన వానపల్లి నూకరాజు(36) వృత్తి కార్మికుడిని ల్యారస్‌ ల్యాబ్స్‌ కంపెనీకి ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు వేగంగా ఢీకొంది.

Published : 05 Oct 2022 04:51 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: వారం రోజుల తేడాలో జరిగిన రెండు బ్రాండిక్స్‌ దుస్తుల కంపెనీ బస్సుల ప్రమాదాలను మర్చిపోకుండానే హరిపాలెంలో మరో ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న గ్రామానికి చెందిన వానపల్లి నూకరాజు(36) వృత్తి కార్మికుడిని ల్యారస్‌ ల్యాబ్స్‌ కంపెనీకి ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు వేగంగా ఢీకొంది. ఈప్రమాదంలో నూకరాజు తలకు తీవ్రగాయమై రక్తస్రావమైంది. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు కేజీహెచ్‌కి చికిత్స నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సీఐ మురళీరావు, ఎస్సై ఉపేంద్ర తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని