logo

ఉక్కు సంకల్పంతో ఉద్యమిద్దాం: ఎంపీపీ

విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని కోరుతూ ఉత్తరాంధ్ర ప్రాంతమంతా ఉక్కు సంకల్పంతో ఉద్యమించాలని బొండపల్లి ఎంపీపీ చల్లా చెల్లంనాయుడు, జెడ్పీటీసీ సభ్యులు రాపాక సూర్యప్రకాశరావు పిలుపునిచ్చారు.

Published : 05 Oct 2022 19:45 IST

బొండపల్లి: విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని కోరుతూ ఉత్తరాంధ్ర ప్రాంతమంతా ఉక్కు సంకల్పంతో ఉద్యమించాలని బొండపల్లి ఎంపీపీ చల్లా చెల్లంనాయుడు, జెడ్పీటీసీ సభ్యులు రాపాక సూర్యప్రకాశరావు పిలుపునిచ్చారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించడం వల్లే సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. విజయదశమిని పురస్కరించుకొని బుధవారం దేవుపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన నేతలు.. తెదేపా అధినేత చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరారు. అలాగే, అదే గ్రామంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వైకాపా అధ్యక్షుడు ఐ.తిరుపతిరావు, సహకార సంఘ ప్రతినిధి పి.అప్పలనాయుడు, ఆర్‌.పాపారావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని