శాంతమ్మా.. మీరు సూపరమ్మా!
వేదగణితం విస్తృతికి కృషి అవసరాన్ని బట్టి కాలాన్ని, శక్తిని ఉపయోగించాలి. వృథా చేసిన సమయాన్ని ఎంత ఖర్చు చేసినా తీసుకురాలేం. కోల్పోయిన శక్తిని తిరిగి సృష్టించలేం’ అంటారు ఆచార్య డాక్టర్ చిరుకూరి శాంతమ్మ.
బోధనలో విశ్రమించని ఆచార్యురాలు
వేదగణితం విస్తృతికి కృషి అవసరాన్ని బట్టి కాలాన్ని, శక్తిని ఉపయోగించాలి. వృథా చేసిన సమయాన్ని ఎంత ఖర్చు చేసినా తీసుకురాలేం. కోల్పోయిన శక్తిని తిరిగి సృష్టించలేం’ అంటారు ఆచార్య డాక్టర్ చిరుకూరి శాంతమ్మ. అందుకేనేమో ఆమె తొమ్మిది పదుల వయసు దాటినా ఇప్పటికీ విద్యార్థులకు బోధన సాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వేద గణిత విస్తృతికి కృషి చేస్తున్నారు.
* సాధారణ జీవనం..
విశాఖ మహానగరంలో విలాస వంతంగా జీవించే అవకాశం ఉన్నప్పటికీ అత్యంత సాధారణంగా కాలం గడుపుతున్నారు. ఒక మంచం, దాని ముందు చదువుకునే పుస్తకాలు, దుస్తులు, అవసరమైన మందులే ఉంటాయి. వంటకు చిన్న గదిలో అవసమైన సామగ్రి ఉంటాయి. శాంతమ్మది ముందు నుంచి ఆర్థికంగా ఉన్నత కుటుంబం. భర్త ఏయూ తెలుగు విభాగం ఆచార్యులుగా పని చేశారు. అయినప్పటికీ ఎటువంటి విలాసాలకు పోకుండా పురాతన, ఇతిహాస గ్రంథాలు చదువుకుంటూ వేద గణితాన్ని అధ్యయనం చేస్తున్నారు.
భౌతికశాస్త్రంలో డాక్టర్ ఆఫ్ సైన్స్ చేసిన మొదటి మహిళ ఈమె. అప్పట్లో బ్రిటన్ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ (ఎఫ్ఆర్సీ)కు చెందిన ఆచార్యుల పరిశీలనలో పట్టా పొందిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. స్పెక్ట్రోస్కోపీలో ఆల్ట్రావైలట్ నుంచి రేడియోఫ్రీక్వెన్సీలపై విశేష పరిశోధనలు చేసి ప్రయోగశాలలను అభివృద్ధి చేసిన డా.రంగధామారావు మార్గదర్శకంలో ఆమె పరిశోధనలు చేశారు. ఆ తరువాత విశాఖలోని ఏయూలోనే 1947లో అధ్యాపకురాలిగా చేరి భౌతికశాస్త్ర విభాగం ఆచార్యులుగా 1989లో పదవీ విరమణ చేశారు. ఆమె ఆధ్వర్యంలో 17 మందికి పీహెచ్డీ డాక్టరేట్లు పొందారు. లేజర్ సాంకేతిక పరిజ్ఞానం, పెట్రోల్లో మలినాల గుర్తింపు , అడ్వాన్స్ గ్రూప్ థియరీలపై యూజీసీ, డిపార్టుమెంటు ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ), సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) ప్రాజెక్టుల్లో ప్రిన్సిపల్ ఇన్విస్టిగేటర్గా చేశారు. అమెరికా, ఇంగ్లండ్, దక్షిణ కొరియాలోని విశ్వవిద్యాలయాలు శాంతమ్మను ఆహ్వానించి విజ్ఞాన సంగతులు తెలుసుకున్నాయి.
* సుప్రసిద్ధుల బోధనలతో: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో సుప్రసిద్ధులైన సూరిభగవంతం (ఈయన డిపార్టుమెంటు ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్యుడు), శేషాద్రిల ఆధ్వర్యంలో పాఠ్యాంశాలు నేర్చుకున్నారు. సీవీ రామన్ ఏయూకు వచ్చిన సందర్భంలో ఆయన ఇచ్చిన రెండు ప్రసంగాలు విని సందేహాలు నివృత్తి చేసుకున్నారు. అలాగే సర్వేపల్లి రాధకృష్ణన్, సీఆర్ రెడ్డిల ఉపన్యాసాలు విన్నారు.
అంతే చురుగ్గా: వయసు పైబడినా పాఠ్యాంశాలు బోధించాలనే ఆసక్తి శాంతమ్మలో తగ్గలేదు. తొమ్మిది పదుల వయసులోనూ అదే వాగ్ధాటి, అంతే జ్ఞాపకశక్తి. విద్యార్థులను ఆకట్టుకునేలా బోధిస్తున్నారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయం క్యాంపస్ (విజయనగరం సమీపంలో) వారానికి నాలుగు తరగతులు బోధిస్తారు. ఉదయం 7.30 గంటలకు వెళ్లి తిరిగి 6 గంటలకు ఇంటికి వస్తారు. రోజంతా అక్కడే గడుపుతారు. కళాశాలకు వెళ్లిన రోజుల్లో అలా నిత్యం రాను,పోను దాదాపు 60 కి.మీ. ప్రయాణం చేస్తారు. ఆ విశ్వవిద్యాలయంలో అనస్థీషియా, రేడియాలజీ , మెడికల్ ఫిజిక్స్ పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా ఆమె జీవితానుభవాలను పిల్లలతో పంచుకొని వారిలో స్ఫూర్తి కలిగిస్తున్నారు. ఇందుకు వాహన ఖర్చు మినహా ఉచితంగా చెప్పడం విశేషం.
* ఎక్కడ సదస్సులు జరిగినా హాజరవుతుంటారు. కరోనా సమయంలో ఇంటికే పరిమితమయ్యారు. 30 ఏళ్లకే అనారోగ్యం బారిన పడుతున్న ఈ రోజుల్లో ఆమెకు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు లేవు.
* ఆ మక్కువతో: డా.శాంతమ్మకు బాల్యం నుంచి గణితం అంటే ఆసక్తి. ఇంటర్లో రసాయన, భౌతికశాస్త్రాల్లో ‘విక్రమ్దేవ్ బంగారు’ పతకం అందుకున్నారు. ఆ ఉత్సాహంతో (నాటి విక్రమ్ దేవ్ కళాశాల, నేటి ఏయూ ఏయూ భౌతికశాస్త్ర విభాగం) భౌతికశాస్త్ర బోధనకు చేరారు. అయినా గణితంపై మక్కువ పోలేదు.
* జగద్గురు శంకరాచార్య భారతీకృష్ణతీర్థ మహారాజు రచించిన వేద గణితంలోని 29 సూత్రాలను శాంతమ్మ అయిదు పుస్తకాల్లో తీసుకొచ్చారు. వీటిని ఇప్పటి వరకు ఆరుసార్లు ముద్రించారు. వేదిక్ గ్లోబల్ కాన్ఫరెన్స్ల్లో ఆమె రాసిన అయిదు పుస్తకాలు ప్రదర్శిస్తుంటారు. వేదగణిత సూత్రాల్లో ఒక గణితాంశానికి ఆ సూత్రంలోనే సమస్యా పరిష్కారం ఉంటుందని, చాలా సులభమని విశ్లేషించారు.
* ఆమె ఒక గణిత సూత్రాన్ని తీసుకొని పాశ్చాత్య విధానం, వేదగణితంలో చేసి చూపించి ఎంత సులభమో వివరింస్తుంటారు. ఆసక్తిగా నేర్చుకుంటే నెల రోజుల్లో పట్టు సాధించొచ్చంటున్నారు.
* దేశంలో బోధన కొనసాగిస్తున్న అత్యంత వృద్ధురాలైన ప్రొఫెసర్గా ఆచార్య శాంతమ్మ పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు ప్రతిపాదన పంపినట్లు సెంచూరియన్ వర్సిటీ ఉప కులపతి జీఎస్ఎన్ రాజు పేర్కొన్నారు. ఈయన కూడా గతంలో ఆమె శిష్యుడే.
మన మూలాలే బోధనాంశాలు కావాలి: ‘ప్రస్తుతం బ్రిటీష్ గణిత విధానాలను మన పాఠ్యంశాలలో పొందుపరిచారు. వాటినే నేర్చుకుంటున్నాం. వాటికి బదులు వేదాల్లో నిక్షిప్తమై ఉన్న వేదగణితాంశాలను పాఠ్యాంశాల్లో చేర్చి పిల్లలకు నేర్పిస్తే మంచిది. మన మూలాలకు చెందిన వేదగణితాన్ని బోధనాంశాలుగా చేర్చాలి. అందుకూ ఎవరూ ధైర్యం డం లేదు’ అని ఆచార్య శాంతమ్మ పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
[ 28-03-2024]
నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. -
ఆ వర్గాలకుసీట్లేవి?
[ 28-03-2024]
ఉమ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు. -
ప్రలోభాలపై నిఘా... ఉల్లంఘనలపై కఠిన చర్యలు
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
ఉత్తరం నుంచి మూడోసారి..
[ 28-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి త్రిముఖ వ్యూహంతో అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. -
ఘనంగా రామ్చరణ్ జన్మదిన వేడుకలు
[ 28-03-2024]
అనకాపల్లి పట్టణంలో సినీహీరో రామ్చరణ్ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. -
రాష్ట్రాభివృద్ధికే కూటమి పొత్తులు
[ 28-03-2024]
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైకాపాను ఓడించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. -
జనసేనలోకి వైకాపా నేత మన్యాల శ్రీనివాస్
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
విమ్స్లో రోగి సహాయకులపైనే భారం
[ 28-03-2024]
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో నాలుగో తరగతి సిబ్బంది పనితీరుపై రోజురోజుకీ విమర్శలు అధిక మవుతున్నాయి. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. -
సంపులో పడి సెక్యూరిటీ గార్డు మృతి
[ 28-03-2024]
విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటనపై బుధవారం దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. -
డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్టు
[ 28-03-2024]
డీజిల్ స్మగ్లింగ్ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్