సమస్యలెన్నో.. చర్చిస్తారా మరి..!
నిధుల కొరతతో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి. నిబంధనల పేరుతో అర్హులకు సంక్షేమ పథకాలు దూరమవుతున్నాయి. అధికారులు, పాలకపక్ష నేతల మధ్య సమన్వయం కొరవడుతోంది.
నేడు ఉమ్మడి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం
ఈనాడు డిజిటల్, అనకాపల్లి
నిధుల కొరతతో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి. నిబంధనల పేరుతో అర్హులకు సంక్షేమ పథకాలు దూరమవుతున్నాయి. అధికారులు, పాలకపక్ష నేతల మధ్య సమన్వయం కొరవడుతోంది. ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వీటి గురించి జిల్లాస్థాయి వేదికలపై చర్చిస్తేనే పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు ఆ దిశగా ఎప్పుడూ చొరవ చూపడం లేదు. సొంత సమస్యలు, ప్రొటోకాల్ వివాదాలకే ఆయా సమావేశాలను పరిమితం చేస్తున్నారు. నేడు విశాఖలో ఉమ్మడి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. రూ.982.88 కోట్లు ఆదాయం గానూ 980.93 కోట్లు వ్యయంగానూ చూపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 173 కోట్ల ఆదాయం తగ్గనున్నట్లు జెడ్పీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సమావేశంలోనైనా నేతలు ప్రజా సమస్యలపై చర్చిస్తారా లేదో చూడాలి.
నాడు..నేడు అస్తవ్యస్తం..
కశింకోట ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా చేసిన నాడు-నేడు పనులు
పాఠశాలలు..ఆసుపత్రుల్లో చేపడుతున్న నాడు నేడు పనులు అస్తవ్యస్తంగా మారిపోయాయి. పాఠశాలల్లో రెండో విడత చేపడుతున్న నాడునేడు పనులకు నిధుల సమస్య వెంటాడుతోంది. దీంతో చాలావరకు అరకొరగానే పనులు చేసి అసంపూర్తిగా వదిలేస్తున్నారు. విలీనం జరిగి అవసరం లేని పాఠశాలల్లో కూడా ఈ పనులు చేపడుతున్నారు. కశింకోట ప్రాథమిక పాఠశాల నుంచి 120 మందికి పైగా పిల్లలు ఉన్నత పాఠశాలకు పంపించేశారు. ఉన్న ఒకటి రెండు తరగతులకు నాడు నేడు కింద రూ.18 లక్షలు మంజూరు చేశారు. ఆ పనులైనా పూర్తిచేశారంటే అదీలేదు.. గ్రానైట్ పలకలు వేసి వదిలేశారు. నిధుల్లేకపోవడంతో మిగతా పనులపై ముందుకు వెళ్లడం లేదు. కొన్ని పాఠశాలల్లో ముందు అదనపు గదులు మంజూరుచేసి తర్వాత రద్దుచేశారు. ఇసుక, సిమెంటు సరఫరా కూడా సక్రమంగా జరగడం లేదు. ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు అసంపూర్తిగానే ఉంటున్నాయి. దేవరాపల్లి ఆసుపత్రి గురించి గత రెండు సమావేశాల్లో చర్చించినా పనులు పూర్తి చేయలేకపోయారు. మిగతా చోట్లా పనులు అదేతీరుగా ఉన్నాయి.
గుంతలు పూడ్చలేదు..
రహదారుల మరమ్మతులు జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ కమిటీ నిధులతో పీఆర్ రోడ్లపై గుంతలు పూడ్చడానికి టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. 120 కి.మీ మేర గోతులతో దర్శనమిస్తున్నాయి. ర.భ.శా పరిధిలో కొన్ని పనుల జరిగినా ముఖ్యమైన రహదారులను బాగుచేయలేకపోయారు. కశింకోట-బంగారుమెట్ట రోడ్డుకు ఒకవైపు మంత్రి అమర్నాథ్, మరోవైపు ప్రభుత్వ విప్ ధర్మశ్రీ శంకుస్థాపన చేసినా పనులు కార్యరూపంలోకి రాలేదు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) రోడ్ల పరిస్థితి అలాగే ఉంది. రూ.138 కోట్లతో పది రహదారులను ఒక గుత్తేదారుకు అప్పగిస్తే ఇప్పటి వరకు ఒక్కటీ పూర్తిచేయలేదు.
ధాన్యం కొనుగోళ్లుపైనా అనుమానం..
గతేడాది ఉమ్మడి జిల్లాలో 1.3 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకుని కేవలం 43 వేల టన్నులే కొన్నారు. మిగతా ధాన్యమంతా దళారులకే అమ్ముకోవాల్సి వచ్చింది. గోనెసంచుల కొరత, మిల్లర్ల మాయాజాలం, ఆర్బీకే సిబ్బంది చేతివాటం వంటి ఆరోపణలు చాలావరకు వినిపించాయి. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు సహకార సంఘాలు అప్పుడే వెనకడుగు వేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది లక్ష్యం మేర కొనుగోలు చేస్తారా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
* ఉపాధిహామీ వేతనదారులకు రెండు నెలలు కూలి డబ్బులు అందలేదు. దీంతో వారంతా ఈ పనులకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల అనుసంధాన పనులకు నిధుల మంజూరుపైనా ప్రభావం పడుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
* జల్జీవన్ మిషన్ పథకంలో చేపడుతున్న ఇంటింటా కుళాయి కనెక్షన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనుల్లో నాసిరకమైన పైపులు వినియోగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
* జడ్పీ నిధులు రూ.12 కోట్లతో మంజూరు చేసిన పనులు చాలాచోట్ల అసంపూర్తిగా ఉండిపోయాయి. పనులు చేస్తే బిల్లులు చెల్లిస్తారా లేదనన్న అనుమానంతో ఈ పనులు చేపట్టడానికి ఎవరూ ముందుకురావడం లేదు.
* ఉద్యాన శాఖ ద్వారా రాయితీలు మూడేళ్లుగా నిలిచిపోయాయి. రైతులకు మొక్కలు సరఫరా నిలిపేశారు. సుమారు రూ.8 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఈ సొమ్ములు చెల్లిస్తే ఉద్యాన రైతులకు భారం తగ్గడానికి అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!