నర్సీపట్నంలో సీఎం పర్యటన డిసెంబరులో..
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డిసెంబరులో నర్సీపట్నం నియోజకవర్గ పర్యటనకు రానున్నారని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శుక్రవారం పేర్కొన్నారు.
పేర్రాజుకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే గణేష్
నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డిసెంబరులో నర్సీపట్నం నియోజకవర్గ పర్యటనకు రానున్నారని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శుక్రవారం పేర్కొన్నారు. మాకవరపాలెం మండలంలో రూ.500 కోట్లతో తలపెట్టిన వైద్యకళాశాల, రూ.470 కోట్లతో చేపట్టనున్న ఏలేరు, తాండవ జలాశయ అనుసంధాన ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. తాడేపల్లిలో గురువారం సీఎంను కలిసినప్పుడు పర్యటనను ఖరారు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లగా.. పరిష్కారానికి అవసరమైన నిధులిచ్చేందుకు సుముఖత చూపారని వెల్లడించారు. ఈ నెల 28 నుంచి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మళ్లీ మొదలుపెడతానని వివరించారు. గొలుగొండ పర్యటనలో జరిగిన ప్రమాదంలో కాలికి తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స జరిగి 50 రోజులపాటు ఆసుపత్రి, ఇంటికే పరిమితం కావాల్సివచ్చిందన్నారు. వైద్యుల సూచన మేరకు వీల్ఛైర్లోనే గ్రామాల్లో పర్యటిస్తానని, నాతవరం మండలం శృంగవరం నుంచి పర్యటన మొదలవుతుందని చెప్పారు. ఇప్పటివరకు 34 సచివాలయాల పరిధిలో 61 గ్రామాల్లో గడపగడపకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.6.3 కోట్లు మంజూరు చేశామన్నారు. ధర్మసాగరం గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు గెడ్డం పేర్రాజు తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే గణేష్ సమక్షంలో వైకాపాలో చేరారు. ధర్మసాగరం సర్పంచి కన్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి